మొన్నటి వరకూ అతడిని ఒక స్ఫూర్తి దాయకమైన వ్యక్తిగా మీడియా చెబుతూ వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ఫౌండర్లు ఇద్దరిలో ఒకడైన సచిన్ బన్సల్ ను ఎంతగానో కీర్తించింది మీడియా. ఫ్లిప్ కార్ట్ ఐడియా, దాన్ని అమల్లో పెట్టడం, దాని మీద అందరి చూపూ పడేలా చేయడం, చివరకు దాని మార్కెట్ క్యాప్ ను వేల కోట్ల రూపాయలకు పెంచడం.. ఇవన్నీ సచిన్ బన్సల్ విజయగాథలే. ఈ మధ్యనే ఫ్లిప్ కార్ట్ లో తమ వాటాలను కొన్ని వందల కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్టుగా ఉన్నారు దాని ఫౌండర్లు. అలా చూస్తే.. సచిన్ బన్సల్ కూడా వందల కోట్లకు అధిపతే!
అయితే తాజా విషయం ఏమిటంటే.. సచిన్ బన్సల్ మీద బెంగళూరు కోరమంగళ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆయన భార్య ఆయనపై ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులను చేస్తున్నాడంటూ అతడి మీద భార్య కంప్లైంట్ ఇచ్చింది. తమ పెళ్లప్పుడు తన తండ్రి తన భర్తకు 11 లక్షల రూపాయల క్యాష్ ఇచ్చాడని, అలాగే పెళ్లికి మరో 50 లక్షల రూపాయల వరకూ ఖర్చు పెట్టాడని.. అయినా సచిన్ బన్సల్ సంతృప్తి చెందలేదని ఆయన భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సమాచారం.
తన పేరిట కొన్ని ఆస్తులున్నాయని, వాటిని రాసివ్వాలంటూ తన భర్త తనపై ఒత్తిడి చేస్తున్నాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొందట! సప్తసముద్రాలు ఈది పిల్ల కాలువలో మునిగినట్టుగా.. సొంత తెలివి తేటలతో దేశంలోనే ఒక పెద్ద వ్యాపార సామ్రాన్ని ఏర్పరిచిన సచిన్ బన్సల్ ఇలా కట్టుకున్న భార్యను ఆస్తుల కోసం వేధించడంటే విడ్డూరమే! ఫ్లిప్ కార్ట్ కు సంబంధించి అతడు అమ్మిన వాటాల విలువే వందల కోట్లు. అలాంటిది భార్యను ఆస్తుల కోసం వేధించడమా? దానిపై ఆమె పోలిస్ స్టేషన్ కా!