నిర్మాతగా మారుతున్న డిస్ట్రిబ్యూటర్

ఉత్తరాంధ్ర సినీ సర్కిళ్లలో సాయిరామ్ బాబ్జీ అంటే బాగా పరిచయమే. విశాఖసిటీ, జిల్లాల్లో థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో బాగా సీనియర్. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారుతున్నారు. విశాఖ నుంచే వచ్చిన హీరో రాజ్ తరుణ్…

ఉత్తరాంధ్ర సినీ సర్కిళ్లలో సాయిరామ్ బాబ్జీ అంటే బాగా పరిచయమే. విశాఖసిటీ, జిల్లాల్లో థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో బాగా సీనియర్. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారుతున్నారు. విశాఖ నుంచే వచ్చిన హీరో రాజ్ తరుణ్ తో ఒక సినిమా నిర్మించే ప్లానింగ్ లో వున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు మల్లిడి వేణు దర్శకుడు. పుట్టపర్తి సాయిబాబాపై గతంలో కొద్ది నిమిషాల భక్తిరస సాంగ్ డాక్యుమెంటరీ నిర్మించిన బాబ్జీ ఇప్పుడు పూర్తిస్థాయి సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.

మల్లిడి వేణు చిరకాలంగా దర్శకత్వ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. అల్లుశిరీష్ తో సినిమా చేసే అవకాశం ఒకసారి చేతివరకు వచ్చి చేజారింది. నితిన్ తో ఓసారి ప్రాజెక్టు అనుకున్నా కూడా కుదరలేదు. ఇప్పుడు ఫైనల్ గా రాజ్ తరుణ్ తో సెట్ అయింది.

స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ ఇంకా ఏమీ ఫైనల్ కాలేదు. పూర్తిగా స్క్రిప్ట్ మీదనే రాజ్ తరుణ్-వేణు కలిసి బిజీగా వున్నారు. ఇదికాక ఇంకో రెండు స్క్రిప్ట్ ల ఫైనల్ ప్రిపరేషన్ లో వున్నాడు రాజ్ తరుణ్. 2019లో.