పాట పెడదామా వద్దా.. డైలమాలో రాధేశ్యామ్

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా నడుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడా ఒక్క పాటను షూట్…

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా నడుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడా ఒక్క పాటను షూట్ చేద్దామా లేక డ్రాప్ చేద్దామా అనే డైలమాలో యూనిట్ ఉంది. మరి దీనిపై ప్రభాస్ రియాక్షన్ ఏంటి?

ప్రభాస్ మాత్రం ఆ ఒక్క పాట షూట్ చేద్దాం అంటున్నాడు. ఎందుకంటే అదొక రొమాంటిక్ సాంగ్. ఆ పాటను యాడ్ చేయడం వల్ల సినిమాకు ఇంకాస్త ఎక్కువ రొమాంటిక్ లుక్/ఫీల్ వస్తుందని, కాబట్టి ఆ పాట తీద్దామని అంటున్నాడు. 

అటు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ పాట పెట్టడానికే మొగ్గుచూపారు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మాత్రం దీనిపై వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే మూవీ బడ్జెట్ తడిసి మోపెడైంది. కరోనా వల్ల వడ్డీలు పెరిగిపోయాయి. 

ఇలాంటి టైమ్ లో మరో సాంగ్ అంటే అది అదనపు ఖర్చు కిందే లెక్క. సెట్ వేయాలి, హీరోయిన్ కాల్షీట్లు సంపాదించాలి, కనీసం 5 రోజులు షూట్ చేయాలి. మళ్లీ దీనికి గ్రాఫిక్స్ అదనం. అయితే ఈ ఖర్చు ఇక్కడితో ఆగిపోలేదు. సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా రీషూట్ చేయమని ప్రభాస్ కోరుతున్నాడట. 

తన సోలో సీన్స్ కు సంబంధించి ఎక్స్ ప్రెషన్స్ లో చిన్న చిన్న తేడాలున్నాయని, వాటిని రీషూట్ చేస్తే ఇంకా బాగా వస్తాయని చెబుతున్నాడట. చూస్తుంటే..  రాధేశ్యామ్ మరోసారి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది.