యాంక‌ర్ అన‌సూయ‌పై ఎందుకంత అసూయ‌!

యాంక‌ర్ అన‌సూయ‌ను కొంత‌మంది ఆక‌తాయిలు అంత సుల‌భంగా వదిలేలా లేరు. నిన్న‌టి వ‌ర‌కు ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి మాన‌సికంగా హింసించారు. తాజాగా ‘యాక్ట‌ర్స్ మ‌సాలా’  అనే ట్విట‌ర్…

యాంక‌ర్ అన‌సూయ‌ను కొంత‌మంది ఆక‌తాయిలు అంత సుల‌భంగా వదిలేలా లేరు. నిన్న‌టి వ‌ర‌కు ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి మాన‌సికంగా హింసించారు. తాజాగా ‘యాక్ట‌ర్స్ మ‌సాలా’  అనే ట్విట‌ర్ ఖాతా నుంచి ఆమెపై అస‌భ్య‌, అభ్యంత‌క‌ర పోస్ట్ చేసి…ఇబ్బందుల‌కు గురి చేశారు. ఒక్క అన‌సూయే క‌దా ఆ ట్విట‌ర్ ఖాతా సినీ ప్ర‌ముఖుల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌ను గ‌త కాలంగా పెడుతూనే ఉంది.

ఈ నేప‌థ్యంలో అన‌సూయ తీవ్రంగా స్పందించారు. త‌న గురించి అభ్యంత‌ర‌కంగా ట్వీట్ చేసిన వారిని గుర్తించ‌డంతో పాటు అలాంటివి పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్విట‌ర్ ద్వారా ఆమె సైబ‌ర్ పోలీసుల‌ను కోరారు. అన‌సూయ ట్వీట్‌పై సైబ‌ర్ క్రైం అధికారులు  వెంట‌నే స్పందించారు.

‘మేడ‌మ్ వెంట‌నే మేం చ‌ర్య‌లు తీసుకుంటాం. మీ గురించి అభ్యంత‌ర‌క‌ర ట్వీట్ చేసిన వారిని అదుపులోకి తీసుకుంటాం’  అని సైబ‌ర్ క్రైం అధికారులు రీట్వీట్ చేశారు. త‌న ట్వీట్‌కు వెంట‌నే ప్ర‌తిస్పందించిన సైబ‌ర్ క్రైం అధికారుల‌కు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కాగా త‌ర‌చుగా అన‌సూయ‌పై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌కర పోస్టులు పెడుతూ ఆమెను మాన‌సికంగా వేధిస్తున్నారు. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా మొద‌లైన ఆమె ప్ర‌స్థానం…అంచెలంచెలుగా  ఎదుగుతూ వెండితెర‌పై అవకాశాలు ద‌క్కించుకుంటుండం వ‌ల్లే ఆమెపై అసూయ‌తో కొంద‌రు ఇలా చేస్తున్నార‌నే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు