జాన్వీ కపూర్‌ని అతడు ఇప్పుడే వదలడా?

బాలీవుడ్‌లో బిజీ అవుతోంది జాన్వీకపూర్. తొలి సినిమా ‘ధడక్’తో ఇంట్రడక్షన్‌తోనే ఆకట్టుకున్న జాన్వీ ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. జాన్వీ కపూర్‌ను తమ సినిమాల్లో నటింపజేసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.…

బాలీవుడ్‌లో బిజీ అవుతోంది జాన్వీకపూర్. తొలి సినిమా ‘ధడక్’తో ఇంట్రడక్షన్‌తోనే ఆకట్టుకున్న జాన్వీ ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. జాన్వీ కపూర్‌ను తమ సినిమాల్లో నటింపజేసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి తనయను తమ తమ సినిమాల్లో నటింపజేసుకునేందుకు అనేకమంది పోటీలు పడుతున్నారు. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల్లోని మూవీ మేకర్లు కూడా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా వరసపెట్టి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉన్నా.. ఎంపిక విషయంలో మాత్రం జాన్వీ స్లో అండ్ స్టడీగానే ఉంది. ఇప్పుడు శ్రీదేవి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆమె సినిమాల ఎంపికను తండ్రితో పాటు.. మరి కొందరు శ్రేయోభిలాషులు ప్రభావితం చేస్తున్నారు. ఆమెను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జొహార్.. తదుపరి సినిమాల ఎంపికలో ప్రభావితం చేస్తున్నాడనే మాత్రం స్పష్టం అవుతోంది.

‘ధడక్’ తర్వాత జాన్వీ ఓకే చేసిన సినిమా ‘తఖ్త్’. ఇది కూడా ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమానే. కరణ్ జొహార్ సినిమానే. ఇందులో రణ్ వీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీలతో పాటు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే.. జాన్వీ మూడో సినిమా కూడా కరణ్ బ్యానర్ మీదేనని వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ‘దోస్తానా’ సినిమాకు కరణ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందట. దోస్తానా 2గా ఈ సినిమా రాబోతోంది. ఇందులో ఒక హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాను ఫిక్స్ చేశారు. అతడి సరసన జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా సెట్ చేస్తున్నారని సమాచారం. ఇదంతా చూస్తుంటే జాన్వీని కరణ్ జొహార్ ఇప్పుడప్పుడే వదలడని స్పష్టం అవుతోంది.

తొలి సినిమాకు ఆమెకు ముప్పైలక్షల రూపాయల వరకూ పారితోషకం ఇచ్చాడట. ఇతర బ్యానర్ల వాళ్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా వరసపెట్టి తన సినిమాలతోనే ఆమెని బిజీ చేస్తున్నట్టుగా ఉన్నాడు.