సవ్యసాచి ఆంధ్ర @9.5 కోట్లు

నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తయారవుతున్న సవ్యసాచి ఆఖరి షెడ్యూలు స్టార్ట్ అయింది. ఇక నుంచి ఏకబిగిన వచ్చేనెల 10 దాటేవరకు షూటింగ్ వుండే అవకాశం వుంది. దాంతో సినిమా షూట్ వర్క్ పూర్తయవుతుంది.…

నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తయారవుతున్న సవ్యసాచి ఆఖరి షెడ్యూలు స్టార్ట్ అయింది. ఇక నుంచి ఏకబిగిన వచ్చేనెల 10 దాటేవరకు షూటింగ్ వుండే అవకాశం వుంది. దాంతో సినిమా షూట్ వర్క్ పూర్తయవుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వుంటుంది. 

అయితే విడుదల ఎప్పుడు అన్నది ఇంకా శైలజారెడ్డి అల్లుడుతో పంచాయతీ తేలాల్సి వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సవ్యసాచి ఆగస్టు 31కి రెడీ కావడం కష్టం. అందుకే సెప్టెంబర్ 7కు డేట్ ఇవ్వమని నిర్మాతలు అయిన మైత్రీమూవీస్ హీరో నాగచైతన్యను అడగుతున్నట్లు బోగట్టా.

కానీ ఇప్పటికి చాలాసార్లు, రెడీకాలేక, డేట్ లు మారుస్తూ వస్తున్నందున, చైతన్య నమ్మలేకపోతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సెప్టెంబర్ ఏడుకు వచ్చే బదులు మరోవారం వెనక్కు వెళ్తే, శైలజారెడ్డి 31న సవ్యసాచి రెండువారాలు గ్యాప్ తో విడుదల చేయవచ్చని, ఆ సినిమా నిర్మాతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా వుంటే సవ్యసాచి ఆంధ్ర హక్కులు వివిధ ఏరియాలకు తొమ్మిదిన్నర కోట్ల రేషియోలో అమ్మేసారు. అలాగే కర్ణాటక కూడా ఇచ్చేసారు. సీడెడ్ మాత్రం నిర్మాతలు అనుకుంటున్న రేటుకు, బయ్యర్లు అడుగుతున్న రేటు కు మ్యాచ్ కావడంలేదు. శాటిలైట్, ఓవర్ సీస్ ముందే అయిపోయాయి.