త్రివిక్రమ్-పవన్ మళ్లీ కలిసారు

అజ్ఞాతవాసి తరువాత కాస్త దూరం దూరంగా వున్నారంటూ వార్తలు వచ్చాయి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై. కానీ తాను అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే వున్నానని త్రివిక్రమ్ ఆ మధ్య…

అజ్ఞాతవాసి తరువాత కాస్త దూరం దూరంగా వున్నారంటూ వార్తలు వచ్చాయి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై. కానీ తాను అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే వున్నానని త్రివిక్రమ్ ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు ఓ ఇంటర్వూలో. అయితే అజ్ఞాతవాసి ఫలితం ఆ ఇద్దరి స్నేహం మీద ఎటువంటి ప్రభావం చూపించలేదని నిన్న క్లియర్ అయిపోయింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి, భరతనాట్యం కళాకారిణి సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శన నిన్నటికి నిన్న రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. త్రివిక్రమ్ పక్కనే కూర్చుని ఆద్యంతం కార్యక్రమాన్ని వీక్షించారు. అలాగే గేయ రచయిత సిరివెన్నెలను పలకరించి, సవినయంగా మొక్కారు. ఆ తరువాత వేదిక మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పవన్ సతీ సమేతంగా హాజరుకావడం విశేషం.

ఈ సందర్భంగా కార్యక్రమం జరుగుతుండగానే త్రివిక్రమ్-పవన్ అప్పుడప్పుడు ముచ్చటించుకున్నారని, కార్యక్రమానికి విచ్చేసిన వారి సమాచారం. మొత్తం మీద పవన్-త్రివిక్రమ్ అపూర్వ స్నేహం అలాగే వుంది. అజ్ఞాతవాసి ఫలితం దాన్ని చెడగొట్టలేదని అర్థం అయింది. మంచి వార్తే కదా.