అల్లుడికి అడ్డం పడిన సవ్యసాచి

సవ్యసాచి జనాల అత్యుత్సాహానికి నాగ్ చైతన్య అడ్డుకట్ట వేసాడు. చకచకా రెడీ చేసి, శైలజ రెడ్డిని ఆగస్టు 31న విడుదల చేసేద్దామని అనుకున్నారు. దానికి దాదాపు చైతన్య కూడా సై అన్నాడు. కానీ సవ్యసాచి…

సవ్యసాచి జనాల అత్యుత్సాహానికి నాగ్ చైతన్య అడ్డుకట్ట వేసాడు. చకచకా రెడీ చేసి, శైలజ రెడ్డిని ఆగస్టు 31న విడుదల చేసేద్దామని అనుకున్నారు. దానికి దాదాపు చైతన్య కూడా సై అన్నాడు. కానీ సవ్యసాచి సినిమాను ఎలాగైనా ఆగస్టు ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని పట్టుదలగా వున్నారు మైత్రీ మూవీస్ జనాలు.

గట్టిగా వారం రోజులు డేట్ లు ఇస్తే చాలు తమసినిమా రెడీ అయిపోతుంది అంటున్నారు. కానీ జూలై 24 వరకు తమకు కుదరదని శైలజరెడ్డి యూనిట్ కరాఖండీగా చెబుతోందని తెలుస్తోంది.

నిజానికి నాగ్ చైతన్యకు సవ్యసాచినే ముందు ఫినిష్ చేయాలని వుంటే, శైలజరెడ్డి అల్లుడు యూనిట్ చేయగలిగింది లేదు. కానీ చైతూ కూడా ముందుగా శైలజరెడ్డి అల్లుడు విడుదల చేయించాలని, ఆ తరువాత సవ్యసాచి ని థియేటర్లలోకి పంపాలని వున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే శైలజరెడ్డి ఫ్యామీలీ జోనర్, సవ్యసాచి యాక్షన్ జోనర్. ఆ తరువాత వచ్చే శివనిర్వాణ డైరక్షన్ సినిమా కూడా ఫ్యామిలీ జోనర్. ఇలా జోనర్ కు జోనర్ కు మధ్య గ్యాప్ వుంటుందని చైతూ భావిస్తున్నాడు.

తమ పబ్లిసిటీ స్టార్ట్ చేసేసి, సవ్యసాచిని డిఫెన్స్ లో పడేయాలని శైలజరెడ్డి యూనిట్ భావించింది. వారం రోజుల క్రితమే ఫస్ట్ లుక్ రెడీ చేసింది. స్మార్ట్ లుక్ లో వున్న చైతూ పిక్ తో లుక్ రెడీ చేయించారు. కానీ ఓ సారి మైత్రీ మూవీస్ తో మాట్లాడి కానీ విడుదల చేయవద్దని చైతూ అడ్డం పడిపోయాడు.

“మీరూ మాట్లడండి. నేనూ మాట్లాడతాను..వాళ్లను ఒప్పించి, అప్పుడు కానీ లుక్ రిలీజ్ చేయవద్దని” క్లియర్ గా చెప్పేసాడట చైతన్య. శైలజరెడ్డి ఆగస్టు 30 న వేస్తే నెల తిరక్కుండా సెప్టెంబర్ లో సవ్యసాచి రావడం కష్టం. అలా అని శైలజరెడ్డిని వెనక్కు పంపిద్దామంటే, వాళ్లకు అక్టోబర్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వుంది.

హీరో చెప్పాక శైలజరెడ్డి యూనిట్ ఇంకేం మాట్లాడుతుంది, తయారుచేయించిన లుక్కును పక్కన పెట్టేసింది. ఇప్పుడు ముఫై కోట్ల సవ్యసాచి ముందుకు వస్తుందో? 18 కోట్ల శైలజ రెడ్డి ముందుకు వస్తుందో చూడాలి.