హాస్పిటల్ లో చేరిన హీరోయిన్.. ఇంతకీ ఏమైంది?

'ది కేరళ స్టోరీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ, ఆస్పత్రి పాలైంది. కలుషిత ఆహారం తినడం వల్ల ఆమెకు అలర్జీ సోకింది. దీంతో పాటు డయేరియా లక్షణాలు కూడా కనిపించాయి దీంతో…

'ది కేరళ స్టోరీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ, ఆస్పత్రి పాలైంది. కలుషిత ఆహారం తినడం వల్ల ఆమెకు అలర్జీ సోకింది. దీంతో పాటు డయేరియా లక్షణాలు కూడా కనిపించాయి దీంతో హుటాహుటిన ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

తన కొత్త సినిమా ప్రచారానికి రెడీ అవుతున్న టైమ్ లో, అదా శర్మ ఇలా అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం ఆమె ముంబయిలోని ఓ హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

కేరళ స్టోరీ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అదా శర్మ. అప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీ ఒకెత్తు, కేరళ స్టోరీ సినిమా మరో ఎత్తు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

అలా ఊహించని విధంగా వచ్చిన క్రేజ్ తో, స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న అదా శర్మ, వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇలా బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న టైమ్ లో ఆమె అనారోగ్యానికి గురైంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అదా కూడా అలాంటి వ్యాధికే గురైనట్టు వైద్యులు ప్రకటించారు. అయితే అదా శర్మ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే, అదా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంది. ప్రతి రోజూ యోగా కూడా చేస్తుంది. మార్షల్ ఆర్ట్స్ తో పాటు, మరెన్నో కీలకమైన ప్రాచీన కళల్ని ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. మంచి ఆహారం కూడా తీసుకుంటుంది. ఇలాంటి వ్యక్తి కూడా ఆస్పత్రి పాలవ్వడం హాట్ టాపిక్ గా మారింది.