మళ్లీ వీళ్లిద్దరు కలిసేది కష్టమే

కొన్ని నెలల కిందటి సంగతి. రామ్, కిషోర్ తిరుమల కాంబోలో ఉన్నది ఒకటే జిందగీ సినిమా ప్రారంభమైంది. ఆ మూవీ ఓపెనింగ్ లో హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మేఘ ఆకాష్ మెరిశారు. కట్ చేస్తే,…

కొన్ని నెలల కిందటి సంగతి. రామ్, కిషోర్ తిరుమల కాంబోలో ఉన్నది ఒకటే జిందగీ సినిమా ప్రారంభమైంది. ఆ మూవీ ఓపెనింగ్ లో హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మేఘ ఆకాష్ మెరిశారు. కట్ చేస్తే, ఆ సినిమా నుంచి మేఘా ఆకాష్ తప్పుకుంది. నితిన్ తో కలిసి ఛల్ మోహన్ రంగ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది.

ఇప్పుడు మరోసారి రామ్, మేఘ కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ గత అనుభవం దృష్ట్యా రామ్ ఈమెను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్. ఈ సినిమాలో రామ్ సరసన మేఘ ఆకాష్ పేరు పరిశీలనకు వచ్చింది.

ఆమె పేరు ప్రస్తావించిన వెంటనే వద్దు అని రామ్ చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ అలా నో చెప్పిన తర్వాతే కాజల్ పేరు తెరపైకి వచ్చిందట. కాస్త రెమ్యునరేషన్ ఎక్కువైనప్పటికీ కాజల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. నితిన్ కోసం అప్పట్లో మేఘ తీసుకున్న నిర్ణయం, అమెనిలా ఇంకా వెంటాడుతూనే ఉంది.

ప్రస్తుతానికైతే ఛల్ మోహన్ రంగ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు మేఘా ఆకాష్. హీరో సాయిధరమ్ తేజ్ సరసన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఆమెను తీసుకునే అవకాశాలున్నాయి.