15న ‘సూర్య’ ఆడియో

నాపేరు సూర్య ప్రచార కార్యక్రమాలకు ఇక తెరలేస్తోంది. రంగస్థలం విడుదల తరువాతే నా పేరు సూర్య ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నది బన్నీ ఆదేశం. ఆ మేరకు అన్నీ అలా ఆపేసారు. ఇప్పుడు మళ్లీ…

నాపేరు సూర్య ప్రచార కార్యక్రమాలకు ఇక తెరలేస్తోంది. రంగస్థలం విడుదల తరువాతే నా పేరు సూర్య ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నది బన్నీ ఆదేశం. ఆ మేరకు అన్నీ అలా ఆపేసారు. ఇప్పుడు మళ్లీ మొదలు పెడుతున్నారు.

సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 15న చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వెన్యూ రాజమండ్రి నా? విశాఖపట్నం నా? అన్నది డిస్కషన్ లో వుంది. రంగస్థలం ఫంక్షన్ విశాఖలోనే చేసారు. అలాగే ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సాధారణంగా ఆంధ్రలో ఆడియో ఫంక్షన్ చేస్తే, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం కామన్. అయితే ఫర్ ఏ ఛేంజ్, ఈసారి నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ సీడెడ్ ఏరియాలో చేసే అవకాశం వుందని తెలుస్తోంది. అంటే తిరుపతి, కర్నూలుల్లో ఓ చోటై చేసే ఆలోచనలో యూనిట్ వుంది.

ఒక పాట మినహా దాదాపు నా పేరు సూర్య సినిమా వర్క్ అంతా అయిపోయింది. మే 4న విడుదలకు షెడ్యూలు చేసారు. దానికి రెండు వారాల ముందుగా మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా విడుదల కాబోతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మాతలు, నాగబాబు సమర్పకుడు.