రాజమౌళి, బాలయ్య.. మధ్యలో రాజశేఖర్?

మొన్నటికి మొన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ లో రాజశేఖర్ విలన్ గా నటించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ పుకార్లను జీవిత ఖండించారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ లో రాజశేఖర్ నటించడం…

మొన్నటికి మొన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ లో రాజశేఖర్ విలన్ గా నటించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ పుకార్లను జీవిత ఖండించారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ లో రాజశేఖర్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ పై మరో కొత్త ప్రచారం ఊపందుకుంది. బాలయ్య స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలక పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నాడట.

ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టును ఈమధ్యే గ్రాండ్ గా లాంఛ్ చేశాడు బాలయ్య. ఈ సినిమాలో అతడు ఏకంగా 60గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. ఇప్పుడీ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

హీరో పాత్రలు మాత్రమే కాకుండా క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలు కూడా చేస్తానంటూ గతంలో బాలయ్య సమక్షంలోనే ప్రకటించాడు రాజశేఖర్. పైగా ఎన్టీఆర్ బయోపిక్ లాంఛింగ్ కు కూడా హాజరయ్యాడు. దీంతో ఈ సినిమాలో రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందంటూ పుకార్లు వస్తున్నాయి.

ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చేలా దర్శకుడు తేజ మాట్లాడాడు. రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోలు మరో ఇద్దరు కావాలని, సినిమాలో కీలకమైన కొన్ని పాత్రలకు రాజశేఖర్, జగపతి బాబు లాంటి హీరోల అవసరం ఉందని అన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో రాజశేఖర్ కు ఎలాంటి పాత్ర దక్కుతుందో చూడాలి.