ఎన్టీఆర్ కు బాలయ్య నోఎంట్రీ?

ఎన్టీఆర్ బయోపిక్ సన్నాహం స్టార్ట్ అయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఖరారయింది. గురువారం ఉదయం రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు, నిర్మాత…

ఎన్టీఆర్ బయోపిక్ సన్నాహం స్టార్ట్ అయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఖరారయింది. గురువారం ఉదయం రామకృష్ణ హార్టీకల్చరల్ స్టూడియోలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ అల్లుడు, నిర్మాత బాలకృష్ణ బావ అయిన ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు రావడంలేదు. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ కు ఓ ముఖ్యమైన బిల్లు వుందని వినికిడి. ఏదో విధంగా టైమ్ అడ్జస్ట్ చేసుకుని వచ్చే వీలుందని వినికిడి.

ఇదిలా వుంటే ఇండస్ట్రీలో ఎవర్ని పిలవాలి? ఎవర్ని వద్దు అన్నది నిర్మాతగా బాలకృష్ణే డిసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా అబ్బాయ్ కళ్యాణ్ రామ్ కు ఆహ్వానం అందింది. కానీ మరో అబ్బాయ్ ఎన్టీఆర్ కు మాత్రం ఆహ్వానం అందలేదు.

చిరకాలంగా ఈ బాబాయ్ అబ్బాయ్ ల మధ్య కనిపించని గోడవ వున్న విషయం మీడియాలో నలుగుతూనే వుంది. చంద్రబాబు, లోకేష్ దగ్గరకు తీసుకుందామనుకున్నా, బాలకృష్ణకు ఇష్టం లేక ఆగిపోయారనీ వదంతులు వున్నాయి. ఇప్పుడు ఎన్నికల తరుణంలో ఎన్టీఆర్ అవసరం ఎంతయినావుంది తెలుగుదేశం పార్టీకి. కానీ ఇలాంటి టైమ్ లో కూడా ఇలాంటి అవకాశం వాడుకుని, ఎన్టీఆర్ ను దగ్గరకు తీసేదిపోయి, దూరం పెట్టుకోవడం అంటే బాలయ్య మొండి వైఖరి అర్థం అవుతుంది.

మరి సోదరుడు ఎన్టీఆర్ ను పిలవలేదని కళ్యాణ్ రామ్ వెళ్లడం మానకపోవచ్చు. ఎందుకంటే లోకేష్ మంత్రిపదవి స్వీకారానికి కూడా కళ్యాణ్ రామ్ వెళ్లి వచ్చారు. త్వరలో బాలయ్యతో ఎలాగైనా ఓ సినిమా నిర్మించాలని కళ్యాణ్ రామ్ ఆలోచనలో వున్నారు. అందువల్ల వెళ్లే అవకాశమే ఎక్కువగా వుంది.

ఆ విధంగా మరోసారి నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ ఒంటరిగా మిగిలిపోయినట్లే.