అసలు నిర్మాత బాలయ్యే నంట

ఎన్టీఆర్ బయోపిక్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ సినిమాకు నిర్మాతలు సాయి కొర్రపాటి, సిసిఎల్ విష్ణు అని, బాలయ్య సమర్పకుడిగా వుంటారని ఆది నుంచి వార్తలు వినవస్తూ వచ్చాయి.…

ఎన్టీఆర్ బయోపిక్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ సినిమాకు నిర్మాతలు సాయి కొర్రపాటి, సిసిఎల్ విష్ణు అని, బాలయ్య సమర్పకుడిగా వుంటారని ఆది నుంచి వార్తలు వినవస్తూ వచ్చాయి.

కానీ ఇప్పుడు టోటోల్ సీన్ మారిపోయిందని తెలుస్తోంది. సినిమాకు నిర్మాత బాలకృష్ణనే నట. సిసిఎల్ విష్ణు, సాయి కొర్రపాటి కేవలం చిన్న పాటి భాగస్వాములు మాత్రమే అంట.

సినిమా వ్యయంలో అధిక భాగం భరించేది బాలకృష్ణనే అని తెలుస్తోంది. అందుకోసమే ఎన్ బి కే ఫిల్మ్స్ అనే బ్యానర్ ను బాలయ్య స్టార్ట్ చేసారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సమర్పిస్తాయి. నిర్మాతగా బాలయ్య పేరే ప్రముఖంగా వుంటుంది.

అందువల్ల హీరోగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా సినిమా వ్యవహారాలు మొత్తం బాలకృష్ణనే చూసుకుంటున్నారట. ఆయన ఆదేశాల మేరకు జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం సాయి కొర్రపాటి చూసుకుంటున్నారట.

ఎన్టీఆర్ బయోపిక్ కు ఖర్చు ఎలా అవుతుందో చూడాలి. కీరవాణి, బాలీవుడ్ టెక్నీషియన్ సంతోష్ తుండియల్ లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. స్టార్ కాస్ట్ కూడా కాస్త గట్టిగానే వుంటుంది. సిజి వర్క్ కూడా బాగానే వుంటుంది. అందువల్ల నిర్మాణ వ్యయం కాస్త గట్టిగానే అయ్యే అవకాశంవుంది.