సురేందర్‌కి ఫిదా అయిన చరణ్‌

'ధృవ' చిత్రాన్ని తెరకెక్కించిన తీరుకి దర్శకుడు సురేందర్‌ అంటే చరణ్‌కి చాలా గురి ఏర్పడింది. అందుకే రెండు వందల కోట్ల విలువైన 'సైరా నరసింహారెడ్డి'లాంటి ప్రాజెక్టుని అతని చేతుల్లో పెట్టాడు. మరెవరైనా అనుభవజ్ఞుడైన దర్శకుడికి…

'ధృవ' చిత్రాన్ని తెరకెక్కించిన తీరుకి దర్శకుడు సురేందర్‌ అంటే చరణ్‌కి చాలా గురి ఏర్పడింది. అందుకే రెండు వందల కోట్ల విలువైన 'సైరా నరసింహారెడ్డి'లాంటి ప్రాజెక్టుని అతని చేతుల్లో పెట్టాడు. మరెవరైనా అనుభవజ్ఞుడైన దర్శకుడికి అప్పగించాలనే చిరంజీవి సూచనని కూడా చరణ్‌ ఖాతరు చేయలేదు.

కేవలం సెట్స్‌ మీదే కాకుండా సెట్స్‌కి బయట కూడా వీరి స్నేహం బాగా బలపడింది. ఫ్యామిలీస్‌తో కలిసి టూర్లకి వెళుతున్నారు. సైరా తర్వాత సురేందర్‌ టాప్‌ డైరెక్టర్‌ అయిపోతాడని చరణ్‌ బలంగా నమ్ముతున్నాడు. అందుకే అతని మలి చిత్రాన్ని కూడా తన బ్యానర్లోనే చేయాలని ఇప్పుడే కమిట్‌ చేయించుకున్నాడు.

సురేందర్‌కి ఎప్పట్నుంచో ఒక లవ్‌స్టోరీ తీయాలని వుందట. తనతోనే విభిన్నమైన లవ్‌స్టోరీ చేయాలని చరణ్‌ చెప్పడంతో సురేందర్‌ సరేనన్నాడట. సైరా ఎప్పటికి పూర్తయితే అప్పుడు సురేందర్‌ ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ స్టార్ట్‌ చేస్తాడన్నమాట.

కేవలం సురేందర్‌ అనే కాకుండా తనతో పని చేసే దర్శకులందరితో చరణ్‌ చాలా మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తున్నాడట. రంగస్థలం తర్వాత తన బ్యానర్లో వర్క్‌ చేయాలంటూ సుకుమార్‌కి ఆల్రెడీ అడ్వాన్స్‌ ఇచ్చాడని భోగట్టా.