ఈ సినిమాను ఎవరు కొంటారు..?

పవన్-త్రివిక్రమ్ నిర్మాతలుగా మారి తీస్తున్న సినిమా. స్వయంగా త్రివిక్రమ్ కథ అందించిన సినిమా. Advertisement ఇలా నితిన్ నటించిన మూవీపై మొన్నటివరకు చాలా క్రేజ్ ఉండేది. కానీ అదంతా ఇప్పుడు ఒక్కసారిగా గాలి తీసిన…

పవన్-త్రివిక్రమ్ నిర్మాతలుగా మారి తీస్తున్న సినిమా.
స్వయంగా త్రివిక్రమ్ కథ అందించిన సినిమా.

ఇలా నితిన్ నటించిన మూవీపై మొన్నటివరకు చాలా క్రేజ్ ఉండేది. కానీ అదంతా ఇప్పుడు ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్ మాదిరి తయారైంది. చివరికి ఈరోజు ఈ సినిమా పేరు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

నితిన్ తన 25వ సినిమాగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఈసినిమా చేస్తున్నాడు. ఈమూవీకి ఛల్ మోహన్ రంగ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ లో భాగంగా 2స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. మరో వారం రోజుల్లో బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్న మేకర్స్ కు దరిదాపుల్లో శుభ సూచకాలు కనిపించడం లేదు. ఈమూవీపై డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది.

రీసెంట్ గా 'లై' లాంటి అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు నితిన్. అటు అజ్ఞాతవాసి రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక కృష్ణచైతన్య అనే దర్శకుడి గురించి చాలామంది జనాలకు తెలీదు. మేఘా ఆకాష్ స్టార్ హీరోయిన్ కాదు. సో.. ఎలా చూసుకున్నా ఈ సినిమాకు క్రేజ్ వచ్చే పరిస్థితి లేదు.

స్టోరీ త్రివిక్రమ్ దే అయినప్పటికీ ఇందులో వేలు పెట్టలేదట. ఎందుకంటే ఈ మూవీ మేకింగ్ టైమ్ లో అజ్ఞాతవాసి పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. ఈ కథకు స్క్రీన్ ప్లే, మాటలు కృష్ణ చైతన్యే రాసుకున్నాడు. మరో 3రోజుల్లో (14వ తేదీన) రిలీజ్ కానున్న టీజర్ తోనైనా ఈ సినిమా కాస్త ఎట్రాక్ట్ చేస్తుందేమో చూడాలి.