రజనీపై వచ్చిన డబ్బును వడివేలుపై పెడుతున్నాడు

ప్రస్తుతం రజనీకాంత్ తో 2.0 సినిమా చేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఈ మూవీ కోసం కాస్త భారీగానే పారితోషికం పుచ్చుకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతున్నాడు. అది కూడా వడివేలు…

ప్రస్తుతం రజనీకాంత్ తో 2.0 సినిమా చేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఈ మూవీ కోసం కాస్త భారీగానే పారితోషికం పుచ్చుకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో త్వరలోనే ఓ సినిమా నిర్మించబోతున్నాడు. అది కూడా వడివేలు హీరోగా కావడం విశేషం.

గతంలో వడివేలు హీరోగా “హింసించే 23వ రాజు పులకేశి” అనే సినిమా నిర్మించాడు శంకర్. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడు. 2.0 తర్వాత శంకర్ చేయబోయే ప్రాజెక్టు ఇదే. పులకేశితో పోలిస్తే పులకేశి-2లో మరిన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. సీక్వెల్ లో వడివేలు ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాడట.

తను డైరక్ట్ చేసే సినిమాలకు భారీగా ఖర్చు చేయిస్తాడు శంకర్. కానీ తను సొంతంగా నిర్మించే సినిమాల్ని మాత్రం మీడియం రేంజ్ బడ్జెట్ లో పూర్తిచేయడం శంకర్ కు అలవాటు.

అయితే ఈసారి మాత్రం ఈ నియమాన్ని పక్కనపెడుతున్నాడు. పులకేశి-2 కోసం లైకా ప్రొడక్షన్స్ ను కూడా రంగంలోకి దించుతున్నాడు. శంకర్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పులకేశి-2ను తీయబోతున్నారు. శింబు దేవన్ ఈ ప్రాజెక్టుకు దర్శకుడు.