అనుష్క.. నిశ్చితార్థం అయిపోయిందా?

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డెహ్రాడూన్ వెళ్లిన భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ నటీమణి అనుష్క శర్మలు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారా? సింపుల్ గా జరిగిన ఈ కార్యక్రమానికి…

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డెహ్రాడూన్ వెళ్లిన భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ నటీమణి అనుష్క శర్మలు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారా? సింపుల్ గా జరిగిన ఈ కార్యక్రమానికి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వేత్తలు కూడా హాజరయ్యారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

విరాట్ , అనుష్కలు డెహ్రాడూన్ కు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసివెళ్లారని మొదట్లోనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత అక్కడ నుంచి వీరు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. వీరు రుద్రాక్ష మాలలు ధరించి ఫొటోలు దిగడంతో నిశ్చితార్థం ఊహాగానాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వీరి వెంట ఉండటం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

ఇక వీళ్లు ఆ టూర్లో ఉండగానే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, రిలయన్స్ అంబానీల కుటుంబం కూడా డెహ్రాడూన్ లో అగుపించడం ఆసక్తికరంగా మారింది. వీరంతా అక్కడకు ఎందుకు వెళ్లారో కానీ.. ఇదంతా విరాట్- అనుష్కల నిశ్చితార్థ సంబరమే అనే ప్రచారం ఊపందుకుంది.

ఇదే సమయంలో ఒక పూజారి పక్కన విరాట్- అనుష్కలు దిగిన ఫోటో.. ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. వీళ్లకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందనే వార్త హోరెత్తుతోంది. మరి అసలు కథ ఏమిటో.. డెహ్రాడూన్ లోని సెలబ్రిటీలే చెప్పాలి!