చరణ్ సరసన అనుపమ

సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిపోయినట్లే. ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసారు. Advertisement వాస్తవానికి ఈ సినిమా…

సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిపోయినట్లే. ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసారు.

వాస్తవానికి ఈ సినిమా హీరోయిన్ రేస్ లో అనుపమ పరమేశ్వరన్, సమంత కూడా వున్నారు. సమంత వైపు ముందు కొంచెం మొగ్గారు. కానీ మళ్లీ ఏమయిందో, అనుపమకే అందరూ ఓటేసినట్లు తెలుస్తోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 19980-90 మధ్య కాలపు ప్రేమకథ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూట్ జనవరిలో ఒక వారం వుంటుంది.

ఈస్ట్ గోదావరి లోని నాచురల్ లోకేషన్ లలో ఒక వారం షూట్ చేసాక, సెట్ లోకి షిఫ్ట్ అవుతుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్.