పోలీస్‌స్టేష‌న్‌లో యూట్యూబ‌ర్ ర‌చ్చ‌ర‌చ్చ‌

మ‌ద్యం మ‌త్తులో మూడు వాహ‌నాల‌ను ఢీకొట్టిన యూట్యూబ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ర‌చ్చ‌రచ్చ చేశాడు. పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. యూట్యూబ‌ర్‌గా త‌న పాపులారిటీని పోలీసుల‌కు చెబుతూ హంగామా చేసిన‌ట్టు స‌మాచారం.  Advertisement ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పేరుతో…

మ‌ద్యం మ‌త్తులో మూడు వాహ‌నాల‌ను ఢీకొట్టిన యూట్యూబ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ర‌చ్చ‌రచ్చ చేశాడు. పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. యూట్యూబ‌ర్‌గా త‌న పాపులారిటీని పోలీసుల‌కు చెబుతూ హంగామా చేసిన‌ట్టు స‌మాచారం. 

ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో నటించిన అతడు యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు.

రెండు రోజుల క్రితం ఫుల్‌గా మ‌ద్యం సేవించి జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 52లోని ఉడ్స్ అపార్ట్‌మెంట్స్ నుంచి త‌న కారులో బ‌య‌ల్దేరాడు. 

మ‌ద్యం మ‌త్తులో డ్రైవింగ్‌పై నియంత్ర‌ణ కోల్పోయి …ఎదురుగా వ‌స్తున్న మూడు వాహ‌నాల‌ను ఢీకొట్టాడు. అలాగే ఒక స్కూట‌రిస్ట్‌ను గాయాల‌పాలు చేశాడు.  దీంతో ష‌ణ్ముక్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు.

కారు దెబ్బతిన్న విజయ్‌ ఫిర్యాదు మేరకు అతడిపై  కేసు నమోదు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పోలీస్‌స్టేషన్‌లో  ష‌ణ్ముఖ్ మ‌ద్యం మ‌త్తులో చిందులేశాడ‌ని తెలిసింది. 

యూట్యూబ‌ర్‌గా సెల‌బ్రిటీ అయిన త‌న‌నే అరెస్ట్ చేస్తారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన‌ట్టు స‌మాచారం. తన ఒక్కో ఎపిసోడ్‌కు కోటి వ్యూస్‌ ఉంటాయి తెలుసా అని పోలీసుల‌ను  దబాయించాడ‌ని స‌మాచారం. మ‌త్తు దిగే వ‌ర‌కూ అత‌ను నానాయాగీ చేసిన‌ట్టు తెలిసింది. 

క‌మ్మవాళ్ళు వైఎస్ కు ఓట్లేసింది అందుకే

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ