బాలయ్య వందో సినిమాలో ఆ ఇద్దరు

బాలయ్య వందో సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. బాలయ్య వందో సినిమాకు రెండు మూడు సబ్జెక్ట్ లు రెడీ చేస్తన్న సంగతి తెలిసిందే. బాలయ్య దగ్గర ఓ మంచి స్క్రిప్ట్…

బాలయ్య వందో సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. బాలయ్య వందో సినిమాకు రెండు మూడు సబ్జెక్ట్ లు రెడీ చేస్తన్న సంగతి తెలిసిందే. బాలయ్య దగ్గర ఓ మంచి స్క్రిప్ట్ వుంది. దానికి దర్శకుడు కృష్ణ వంశీ అయితే పూర్తి న్యాయం చేస్తారని భావించి, ఆయనతో డిస్కషన్లు చేస్తున్నారు. 

కృష్ణవంశీ కూడా ఆ పనిపై బిజీగా వున్నారు. నవంబర్ వరకు హీరోయిన్ సమంత డేట్స్ దొరకవు. అంతవరకు కృష్ణవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రాక్ష స్టార్ట్ కావడం కష్టం,. అందుకే ప్రస్తుతం కృష్ణ వంశీ బాలయ్య ప్రాజెక్టుపై బిజీగా వున్నారు. ఇటీవలే లేపాక్షి ఉత్సవాలకు కూడా వెళ్లివచ్చారు. అక్కడ బాలయ్యతో కాస్సేపు డిస్కషన్ కూడా చేసినట్లు వినికిడి.

ఇదిలా వుంటే ఆ కథలో వీలయితే, రెండు మంచి పాత్రలకు నారా రోహిత్, తారకరత్నలకు అవకాశం వుండేలా చూడమని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. కావాలని ఇరికించినట్లు కాకుండా, పాత్రోచితంగా, కథా పరంగా బాగుండేలా చూడమని చెప్పినట్లు తెలిసింది. ఆ విధంగి బాలయ్య వందో సినిమా కూడా మల్టీస్టారర్ అవుతుందన్నమాట. ఈ మేరకు కృష్ణవంశీ కథపై కసర్తత్తు చేస్తున్నట్లు వినికిడి.