ఆ ముగ్గురూ రాలేదు ఏలనో?

బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతంగా ముగిసింది. కానీ లోటు వుండనే వుంది. బ్రో సినిమాకు కర్త..కర్మ..క్రియ, ఆ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ రాకపోవడం. ఆయన రాలేదు అనడానికి…

బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతంగా ముగిసింది. కానీ లోటు వుండనే వుంది. బ్రో సినిమాకు కర్త..కర్మ..క్రియ, ఆ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ రాకపోవడం. ఆయన రాలేదు అనడానికి రీజన్ ఏమీ కనిపించడం లేదు.

ఎందుకంటే ఓన్లీ యూనిట్ మాత్రమే అన్నా, ఆయన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. లాభాల వాటా దారు కూడా. మరెందుకు రాలేదు అంటే..అందరూ అనుకునేది ఒకటే. ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో కావాలనే ఈ ఫంక్షన్ కు దూరంగా వుండి వుంటారని భావిస్తున్నారు.

సరే, త్రివిక్రమ్ సంగతి పక్కన పెడితే హరీష్ శంకర్-క్రిష్ కూడా ఈ ఫంక్షన్ కు హాజరు కాలేదు.

నిజానికి ఇలాంటి చాన్స్ ను హరీష్ అస్సలు వదులుకునే వారు కాదు. పీపుల్స్ మీడియా అధినేతలు పిలవకుండా వుండరు. పైగా హరీష్ అదే బ్యానర్ లో సినిమా చేయబోతున్నారు. మరెందుకు రాలేదు అంటే సమాధానం తెలియాల్సి వుంది. అయితే త్రివిక్రమ్ తన సినిమాకు అడ్డం పడుతున్నారని, అలాంటి త్రివిక్రమ్ సెట్ చేసిన సినిమా ఫంక్షన్ కు తానెందుకు వెళ్లాలని అనుకుని అలిగారేమో అనే అభిప్రాయాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

ఇక మరో దర్శకుడు క్రిష్. ఆయన వస్తారు..హరి హర వీరమల్లు సినిమా గురించి మాట్లాడతారు అని ఫ్యాన్స్ ఎదురు చూసారు. కానీ ఆయన కూడా రాలేదు. తన సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని స్థితిలో వున్నారు క్రిష్. ఇలాంటపుడు హీరో గుడ్ లుక్స్ లో వుండాలని అనుకుంటారు ఎవరైనా. కానీ క్రిష్ రాలేదు అంటే సమ్ థింగ్..సమ్ థింగ్..అని గుసగుసలు వినిపిస్తున్నాయి.