సచివాలయ ఉద్యోగులకు ఇది షాకింగ్ న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో జవాబుదారీతనం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెస్తోంది. బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చినా మిషన్ పనిచేయలేదని, ఆన్ డ్యూటీ…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో జవాబుదారీతనం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తెస్తోంది. బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చినా మిషన్ పనిచేయలేదని, ఆన్ డ్యూటీ అని, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. 

సంతకాలతోనే హాజరు పట్టీ నింపేశారు. అయితే బయోమెట్రిక్ వ్యవహారంపై కఠినంగా ఉండాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి దాన్ని తప్పనిసరి చేసింది. ఇకపై సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు లేకపోతే ఆ రోజుకి జీతం పడదు. 

జీతానికి, బయోమెట్రిక్ కి అనుసంధానం చేసినట్టు తాజాగా ఉత్తర్వులిచ్చారు ఉన్నతాధికారులు. అంతేకాదు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు విధిగా సచివాలయంలోనే ఉండాలని, ఆ సమయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరకించాలని తేల్చి చెప్పారు.

ఇకపై ఆ ఆటలు సాగవు..

ఇన్నాళ్లూ పని ఉన్నరోజు ఆఫీస్ కి వెళ్లి, పని లేదనుకుంటే ఇంటి దగ్గర నుంచే వ్యవహారం నడిపించేవారు ఉద్యోగులు. అవసరమైనప్పుడు రిజిస్టర్లలో సంతకాలు పెట్టేవారు. ఆమధ్య ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు తనిఖీలు చేపట్టినా, అసలు పని మానేసి, తనిఖీలకే సమయం గడిచిపోతుండే సరికి దాన్ని పక్కనపెట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగులు, వారి పనితీరుపై చాలానే ఫిర్యాదులు వచ్చాయి.

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేశారు అధికారులు. దీంతోపాటు సాయంత్రం 3నుంచి 5 గంటల వరకు కచ్చితంగా సచివాలయంలోనే ఉండాలనే నిబంధన విధించారు. అంతే కాదు, ఆ సమయంలో ఫిర్యాదులివ్వడానికి వచ్చినవారు, ఉద్యోగులు లేని విషయాన్ని గమనించి ఫిర్యాదు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్నిటికీ డెడ్ లైన్..

రైస్ కార్డ్, పింఛన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్ వంటి వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలనే ఆదేశాలు గతంలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని కచ్చితంగా అమలు చేయాలని, అలా చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. 20 రోజుల్లోపు ఆరోగ్యశ్రీ కార్డు, 10 రోజుల్లో రైస్ కార్డు, 21 రోజుల్లో పెన్షన్ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టాలు.. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను ఎంపిక చేసి ఇవ్వాలి.

మొత్తమ్మీద కొత్త నిబంధనలతో సచివాలయ ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడినా, అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందని, ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అంటున్నారు.

పవన్ ఓ మానసిక రోగి

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ