ఆ మూడు అక్షరాలే వైసీపీ ధైర్యం

టీడీపీకి ఉత్తరాంధ్రాలో పరువు నిలిపిన జిల్లా విశాఖ మాత్రమే. జగన్ వేవ్ లో మొత్తానికి మొత్తం ఉత్తరాంధ్రా జిల్లాలు అన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోగా విశాఖ సిటీలో మాత్రమే నాడు నాలుగు ఎమ్మెల్యే సీట్లు…

టీడీపీకి ఉత్తరాంధ్రాలో పరువు నిలిపిన జిల్లా విశాఖ మాత్రమే. జగన్ వేవ్ లో మొత్తానికి మొత్తం ఉత్తరాంధ్రా జిల్లాలు అన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోగా విశాఖ సిటీలో మాత్రమే నాడు నాలుగు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి.

ఇదిలా ఉండగా విశాఖ సిటీ పరిసర ప్రాంతాలు ఇపుడు కొత్త జిల్లా అయ్యాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో కూడా వైసీపీ జెండా ఎగరేస్తామని ఇంచార్జి మంత్రి విడదల రజని గట్టిగా చెప్పేశారు. అది జరిగి తీరుతుందని కూడా ఆమె స్పష్టం చేశారు.

ఇక మిగిలిన పార్టీలకూ అందరి నాయకులకూ క్యాడర్ కి  ధైర్యం ఎవరో తెలియదు కానీ వైసీపీ వైసీపీకి మాత్రం జగన్ అన్న మూడు అక్షరాలే ధైర్యం అని ఆమె పేర్కోనడం విశేషం.

జగన్ అండగా ఉన్నాడన్న భరోసావే వైసీపీ క్యాడర్ ని ముందుకు నడిపిస్తుంది అని రజని తెలియచేశారు. ఏపీలో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాలే మళ్ళీ గెలిపిస్తాయన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా సర్కారీ దవాఖానాల రూపు పూర్తిగా మార్చేస్తున్నామని రజని చెబుతూ ఇవే తమ విజయ పతాకాలు అని అభివర్ణించారు. 

మొత్తానికి  ధైర్యంగా విశాఖ టీడీపీ కంచుకోటను బద్ధలు కొడతామని వైసీపీ మంత్రి ప్రకటించడంతో క్యాడర్ లో కొత్త జోష్ వస్తోంది.