Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మరదలిపై కన్నేశాడు.. ఆమె భర్తను చంపేశాడు

మరదలిపై కన్నేశాడు.. ఆమె భర్తను చంపేశాడు

కామంతో కళ్లు మూసుకుపోతే సిగ్గు,భయం అనేది ఉండదంటారు. సరిగ్గా ఇలానే ఉంది హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బుద్ధి. పక్కన భార్యను పెట్టుకొని, ఆమె చెల్లెలపై కన్నేశాడు. అక్కడితో ఆగకుండా.. మరదలిని సొంతం చేసుకునేందుకు ఆమె భర్తను హతమార్చడానికి కూడా వెనకాడలేదు. అలా కామంతో కళ్లు మూసుకుపోయి హంతకుడిగా మారాడు.

నెల్లూరుకు చెందిన సత్యప్రసాద్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో ఇతడికి పెళ్లయింది. అయితే పెళ్లయితే చేసుకున్నాడు కానీ, ఇతడి చూపు మొత్తం భార్య చెల్లెలు శ్రీజపైనే ఉండేది. ఆమె బెంగళూరులో భర్త లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఉంటోంది.

శ్రీజను చూసి మోజుపడిన సత్యప్రసాద్, ఎలాగైనా లక్ష్మణ్ కుమార్ ను తప్పించాలనుకున్నాడు. తన కంపెనీలోనే పనిచేస్తున్న దినేష్ అనే క్యాబ్ డ్రైవర్ తో పరిచయం పెంచుకున్నాడు. లక్ష్మణ్ కుమార్ ను చంపేందుకు అతడికి సుపారీ ఇచ్చాడు. 15 లక్షలకు డీల్ మాట్లాడుకోవడంతో పాటు హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కూడా కొనిస్తానని సత్యప్రసాద్ మాటివ్వడంతో లక్ష్మణ్ ను చంపడానికి దినేష్ ఒప్పుకున్నాడు.

అలా లక్ష్మణ్ పై ఓసారి హత్యాయత్నానికి పాల్పడ్డాడు దినేష్. కానీ ఆ టైమ్ లో తృటిలో తప్పించుకున్నాడు లక్ష్మణ్. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో దినేష్ పై మళ్లీ ఒత్తిడి తెచ్చాడు సత్యప్రసాద్. ఈసారి బెంగళూరులోనే ఉన్న మరికొంతమంది సహాయంతో లక్ష్మణ్ పై దినేష్ ఎటాక్ చేశాడు. ఈసారి మాత్రం లక్ష్మణ్ మృతిచెందాడు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన బెంగళూరు పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిచ్చిన సమాచారంతో హైదరాబాద్ వచ్చి దినేష్ ను అరెస్ట్ చేశారు. దినేష్ చెప్పిన సమాచారంతో అసలు గుట్టు రట్టయింది. ప్రస్తుతం ఈ కేసులో సత్యప్రసాద్ తో పాటు 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మణ్ కు చెందిన ఫొటోలు, వాట్సాప్ లొకేషన్లు సత్యప్రసాద్ ఫోన్ నుంచి దినేష్ ఫోన్ కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

అలా కామంతో కళ్లు మూసుకుపోయి హంతకుడయ్యాడు సత్యప్రసాద్. బంగారంలాంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగం, కుటుంబాన్ని పోగొట్టుకొని కటకటాలపాలయ్యాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?