పెట్రోల్ పోసి ఒకేసారి ఐదుగుర్ని తగలబెట్టాడు

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆ ఐదుగురు చికిత్స పొందుతున్నారు. నిందితుడు కూడా ఆ…

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆ ఐదుగురు చికిత్స పొందుతున్నారు. నిందితుడు కూడా ఆ ఐదుగురి బంధువే.

గంగాధరం మండలం మణికొండకు చెందిన రాజాంకు అతడి భార్య విమలకు మధ్య గొడవలు ఉన్నాయి. వాళ్లకు ఓ కూతురు కూడా ఉంది. పదేళ్లుగా వాళ్ల మధ్య గొడవలు ఉండడంతో.. కూతురితో పాటు పుట్టింటికి వచ్చేసింది విమల. ఇటీవల వీళ్ల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో.. అర్థరాత్రి వాళ్లంతా నిద్రిస్తున్న వేళ పెట్రోల్ తో దాడిచేశాడు రాజం. విమలతో పాటు ఆమె పుట్టింట్లో ఉన్న అందరిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో భార్య విమల, కూతురు సునీతతో పాటు.. వదిన, బావమరిది, ఆయన భార్యపిల్లలు గాయపడ్డారు.

జరిగిన దుర్ఘటనలో విమల తీవ్ర గాయాల పాలైంది. ఆమెకు 90శాతం గాయాలైనట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తు చేయాల్సిన అవసరం లేకుండానే నిందితుడు రాజం లొంగిపోయాడు.