అనుష్క రగడపై కోహ్లీ కామెంట్‌

వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలవడానికి అనుష్క శర్మే కారణమనీ, ఆమె ఆస్ట్రేలియా వెళ్ళకుండా వుండి వుంటే, ఆ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించకుండా వుంటే విరాట్‌ కోహ్లీ రెచ్చిపోయి ఆడేవాడనీ, అనుష్క మీద…

వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలవడానికి అనుష్క శర్మే కారణమనీ, ఆమె ఆస్ట్రేలియా వెళ్ళకుండా వుండి వుంటే, ఆ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించకుండా వుంటే విరాట్‌ కోహ్లీ రెచ్చిపోయి ఆడేవాడనీ, అనుష్క మీద ఫోకస్‌ పెట్టిన కోహ్లీ ఆటను అటకెక్కించేయడంతో టీమిండియా ఘోర పరాజయం పాలయ్యిందంటూ ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌లలో టీమిండియా ‘వీరాభిమానులు’ రెచ్చిపోయి కామెంట్లు పోస్ట్‌ చేసిన విషయం విదితమే.

ఈ వివాదంపై లేటెస్ట్‌గా స్పందించాడు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. అనుష్క బాయ్‌ఫ్రెండ్‌ కూడా అయిన విరాట్‌ కోహ్లీ, ఆ మ్యాచ్‌కీ అనుష్కకీ సంబంధమే లేదు, ఈ వివాదంలోకి అనుష్కను లాగడం మానవత్వం కాదు.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘వరల్డ్‌ కప్‌ ఏ ఆటగాడికైనా వెరీ వెరీ స్పెషల్‌. నేనూ అలాగే భావించాను. సెటిల్డ్‌గా రాణించడానికి ప్రయత్నించారు. ఒక్కోసారి టైమ్‌ కలిసిరాదు.. నాకూ ఫైనల్‌ మ్యాచ్‌లో అలాగే జరిగింది.. దురదృష్టవశాత్తూ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయినా ఆటలో గెలుపోటములు సహజం..’ అని సెలవిచ్చాడు విరాట్‌ కోహ్లీ.

వరల్డ్‌ కప్‌ తర్వాత కోహ్లీ మీడియా మందుకు రావడం ఇదే తొలిసారి.