శిఖర్‌ ధావన్‌ స్టెప్పులేస్తే..

టీమిండియా బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ బుల్లితెరపై స్టెప్పులేయనున్నాడు. ఆయనతోపాటు ఆయన సతీమణి అయేషా కూడా డాన్స్‌ చేసి, బుల్లితెర వీక్షకుల్ని అలరించనుంది. ‘సెలబ్రిటీ స్పెషల్‌’ పేరుతో ‘నాచ్‌ బలియే 7’ సీజన్‌ కోసం షో…

టీమిండియా బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ బుల్లితెరపై స్టెప్పులేయనున్నాడు. ఆయనతోపాటు ఆయన సతీమణి అయేషా కూడా డాన్స్‌ చేసి, బుల్లితెర వీక్షకుల్ని అలరించనుంది. ‘సెలబ్రిటీ స్పెషల్‌’ పేరుతో ‘నాచ్‌ బలియే 7’ సీజన్‌ కోసం షో నిర్వాహకులు శిఖర్‌ ధావన్‌ దంపతుల్ని సంప్రదించారు.

క్రికెటర్లలో చాలామందికి డాన్స్‌ మీద పెద్దగా ఇంట్రెస్ట్‌ వుండదు. శ్రీశాంత్‌ ఒక్కడే మంచి డాన్సర్‌. కొన్ని స్టేజ్‌ పెర్ఫామెన్సెస్‌ కూడా ఇచ్చాడు శ్రీశాంత్‌. కొందరు క్రికెటర్లు మైదానంలో పట్టలేని ఆనందంతో ఏవేవో స్టెప్పులేస్తుంటారుగానీ, టీవీ షోల్లోనో ఇంకో చోటో డాన్సులు చేయడం చాలా అరుదు అనే చెప్పాలి.

ఇక, శిఖర్‌ ధావన్‌ విషయానికొస్తే టీమిండియాలోకి అనూహ్యంగా దూసుకొచ్చి మంచి ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. అయేషాని ప్రేమించి పెళ్ళాడాడు శిఖర్‌ ధావన్‌. అయేషాకి అప్పటికే పెళ్ళయి, పిల్లలు కూడా వున్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన అయేషాను అర్థం చేసుకుని, ఆమెతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడీ క్రికెటర్‌. అయేషా తన జీవితంలోకి వచ్చాకనే క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నానంటాడు శిఖర్‌ ధావన్‌.

మొత్తమ్మీద, శిఖర్‌ ధావన్‌ దంపతులు టీవీ షోలో డాన్స్‌ చేస్తే ఆ షోకి ఓ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్‌లు వస్తాయన్నది నిర్వివాదాంశం. అయితే ఇంకా ఈ విషయమై శిఖర్‌ ధావన్‌ స్పందించాల్సి వుంది. ఆయన్ను సంప్రదించామని మాత్రం షో నిర్వాహకులు చెబుతున్నారు.