5 నెలల నరకం.. మృత్యువుతో పోరాటం

కామాంధుడి చేతిలో బలైంది. చావుబతుకుల మధ్య హాస్పిటల్ లో చేరింది. 5 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. చివరికి విధి ఆమెను బలితీసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. Advertisement…

కామాంధుడి చేతిలో బలైంది. చావుబతుకుల మధ్య హాస్పిటల్ లో చేరింది. 5 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. చివరికి విధి ఆమెను బలితీసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సొంత మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తప్పించుకొని బాత్ రూమ్ లో దాక్కుంది. విషయం బయటకొస్తుందని భయపడిన మేనమామ, బాత్రూమ్ తలుపులు బద్దలుకొట్టి మరీ బాలికను బయటకులాగాడు. అక్కడే ఉన్న యాసిడ్ ను ఆమె నోట్లో పోశాడు.

పనిమీద నెల్లూరు వెళ్లి, ఇంటికొచ్చిన తల్లిదండ్రులు కూతురు పరిస్థితి చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేశారు, మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అప్పట్నుంచి 5 నెలలుగా చెన్నైలో చికిత్స పొందుతున్న బాలిక, నిన్న కన్నుమూసింది.

మృతురాలి తల్లిదండ్రుల బాధను మాటల్లో చెప్పలేం. ఎందకంటే, అప్పటికే వాళ్లు తమ కొడుకును పోగొట్టుకున్నారు. 18 ఏళ్ల వయసులో కొడుకు మరణించాడు. ఇప్పుడు 14 ఏళ్ల వయసులో కూతురు కూడా ప్రాణాలు విడిచింది. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. జరిగిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు కోసం చెన్నైకు వెళ్లారు.