నగ్నంగా 2 శవాలు.. హైదరాబాద్ శివార్లలో కలకలం

హైదరాబాద్ శివార్లలో కలకలం చెలరేగింది. చెట్ల పొదల్లో నగ్నంగా పడి ఉన్న రెండు మృతదేహాల్ని పోలీసులు గుర్తించారు. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి శవాలు అవి. కుళ్లిపోయిన స్థితిలో…

హైదరాబాద్ శివార్లలో కలకలం చెలరేగింది. చెట్ల పొదల్లో నగ్నంగా పడి ఉన్న రెండు మృతదేహాల్ని పోలీసులు గుర్తించారు. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి శవాలు అవి. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాల వెనక మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులున్నారు.

ప్రాధమిక సమాచారం ప్రకారం యువతీయువకులిద్దర్నీ ఎవరో హత్య చేసి, తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. సమీపంలో వాళ్లకు చెందిన వస్తువులు, దుస్తులు కూడా లభించాయి. వాటి ఆధారంగా యువకుడి పేరును యశ్వంత్ గా గుర్తించారు. 3 రోజుల కిందటే ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఎలాంటి జనసంచారం లేని ఆ నిర్మానుష్య ప్రాంతానికి యువతీయువకులు ఎందుకు వెళ్లారనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. వాళ్లను ఎవరు ఫాలో అయ్యారు, ఎందుకు హత్య చేశారనే విషయాల్ని నిర్థారించలేకపోతున్నారు. మరోవైపు యశ్వంత్ సోదరుడు ఘటన స్థలానికి చేరుకొని, యశ్వంత్ ను గుర్తుపట్టాడు. అతడిది వారాసిగూడ.

యశ్వంత్ ఎప్పుడూ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్తాడని, అలా వెళ్లిన మరుసటి రోజు తిరిగి ఇంటికొచ్చేస్తాడని అతడి సోదరుడు చెబుతున్నాడు. ఈసారి మాత్రం 3 రోజులైనా ఇంటికి రాలేదని, పోలీసులు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే అతడు మరణించిన విషయం తెలిసిందంటున్నాడు.

అమ్మాయి-అబ్బాయి ఏకాంతంగా గడపడం కోసమే ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారా.. లేక ఎవరైనా బలవంతంగా వాళ్లను లాక్కొని అక్కడికి తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు.