కూల్ డ్రింక్ లో మత్తు మందు.. 3 రోజులు గ్యాంప్ రేప్

నిర్భయ ఘటనకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయిని 3 రోజుల పాటు బంధించి చిత్రహింసలు పెట్టి, గ్యాంగ్ రేప్ కు గురిచేసింది ఓ ముఠా. ఇందులో అధికారిక టీఆర్ఎస్…

నిర్భయ ఘటనకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయిని 3 రోజుల పాటు బంధించి చిత్రహింసలు పెట్టి, గ్యాంగ్ రేప్ కు గురిచేసింది ఓ ముఠా. ఇందులో అధికారిక టీఆర్ఎస్ పార్టీ నేత కొడుకు కూడా ఉన్నట్టు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ ఘటన జరిగింది.

కోదాడలో ఉంటున్న సరోజకు నలుగురు ఆడపిల్లలు. చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది ఈ కుటుంబం. ఈ నలుగురిలో ఆఖరి అమ్మాయి కిడ్నాప్ కు గురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆటోలోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. తర్వాత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తాగించారు.

మత్తులోకి జారుకున్న యువతిపై 3 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల బారి నుంచి తప్పించుకోవడానికి యువతి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొత్తానికి 3 రోజుల తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకొని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వాళ్లు వచ్చి యువతిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంప్లయింట్ తీసుకున్న పోలీసులు.. షేక్ గౌస్ పాషా తో పాటు అతడికి సహకరించిన సాయిరారెడ్డిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఒకరు స్థానిక టీఆర్ఎస్ నేత కొడుకు. ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.