ఒకే అమ్మాయి.. 2 అత్యాచారాలు.. ఇద్దరు నిందితులు

వంచనకు గురైంది, బ్లాక్ మెయిల్ కు బాధితురాలిగా మారింది. ఫలితంగా ఇద్దరు కామాంధుల చేతిలో మోసపోయింది పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం…

వంచనకు గురైంది, బ్లాక్ మెయిల్ కు బాధితురాలిగా మారింది. ఫలితంగా ఇద్దరు కామాంధుల చేతిలో మోసపోయింది పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నిజామాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి. అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న రోహిత్, ఆమెతో చనుపు పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి అపార్ట్ మెంట్ లో దాగుడుమూతల ఆటలు ఆడుకునేవారు. అలా అమ్మాయికి దగ్గరైన రోహిత్, ఓ రోజు ఆమెను అపార్ట్ మెంట్ పైకి తీసుకెళ్లాడు. నగ్నంగా ఆమె ఫొటోలు తీశాడు.

ఎప్పుడైతే నగ్నంగా ఫొటోల తీశాడో, అప్పుడిక రోహిత్ మారిపోయాడు. వాటిని చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. అలా పలుమార్లు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరిసారి ఈ ఏడాది ఏప్రిల్ లో అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు.

తనపై జరుగుతున్న అకృత్యాల్ని అమ్మాయి ఎవ్వరికీ చెప్పుకోలేకపోయింది. అదే టైమ్ లో భానుప్రసాద్ గౌడ్ అనే యువకుడు, ఇనస్టాగ్రామ్ లో అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఆప్యాయంగా పలకరించాడు. నేనున్నా అంటూ ఓదార్చాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. మాయమాటలు చెప్పి కల్యాణమండపం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ టైమ్ లో అమ్మాయి న్యూడ్ ఫొటోలు కూడా తీశాడు.

ఇక అక్కడ్నుంచి ఇటు రోహిత్, అటు భానుప్రసాద్ గౌడ్ ఇద్దరూ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. అక్కకు పెళ్లి సంబంధం కుదరడంతో, విషయం బయటకొస్తే పరువు పోతుందని భావించి అమ్మాయి తనలోనే ఈ వివరాల్ని దాచుకుంది. అయితే రోజురోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భరించలేని అమ్మాయి, తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలు పక్కాగా ఉండడంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రోహిత్, భానుప్రసాద్ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్, ఓ ప్రభుత్వరంగ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇక భానుప్రసాద్ గల్ఫ్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.