Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

xxxx మీడియం రేంజ్ కు వచ్చిన బడా బ్యానర్

xxxx మీడియం రేంజ్ కు వచ్చిన బడా బ్యానర్

మైత్రీ మూవీమేకర్స్.. తెలుగుతెరపైకి కెరటంలా దూసుకొచ్చిన సంస్థ ఇది. బడా బడ్జెట్, బడా హీరోలు, భారీ చిత్రాలు.. ఇలా ఉండేది ఈ బ్యానర్ వ్యవహారం. పట్టుకుంటే బంగారం అనే టైపులో సాగేది ఈ సంస్థ కథ. కానీ ఇదంతా గతం, ఇప్పుడీ బ్యానర్ మీడియం రేంజ్ చిత్రాలకు పడిపోయింది. వీళ్లు ప్రకటిస్తున్న సినిమాలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడర్ సినిమాలు నిర్మిస్తోంది ఈ సంస్థ. ఇవి కాస్త భారీ బడ్జెట్ సినిమాలే. వీటితో పాటు అల్లు అర్జున్-సుకుమార్ సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే. ఈ రెండు సినిమాలు కాకుండా మిగతా మూవీస్ అన్నింటినీ మీడియం-రేంజ్ బడ్జెట్, మీడియం రేంజ్ హీరోలతో ప్లాన్ చేసింది ఈ సంస్థ. ప్రస్తుతం ఈ బ్యానర్ పై వస్తున్న ఉప్పెన సినిమా అలాంటిదే.

ఉప్పెనతో బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ బ్యానర్... వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో మూవీ ప్లాన్ చేసింది. రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమా తీశాడు ఈ డైరక్టర్. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాను అందించిన స్వరూప్ తో కూడా మరో సినిమా ప్లాన్ చేశారు. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలే.

రీసెంట్ గా ఈ బ్యానర్ కు చెందిన ముగ్గురు నిర్మాతల నుంచి ఒకరు తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రభావం బ్యానర్ లైనప్ పై పడిందనే విషయం కనిపిస్తూనే ఉంది.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?