అది గరుడ పురాణం.. ఇది గవ్వల పురాణం

టీడీపీ చెబుతున్న గరుడ పురాణాన్ని కామెడీ సినిమాగా కొట్టిపడేశారు 30 ఇయర్ ఇండస్ట్రీ పృధ్వి. త్వరలోనే గరుడ పురాణానికి పోటీగా తను గవ్వల పురాణం రిలీజ్ చేస్తానని ప్రకటించారు. వాళ్లు చెప్పేది నిజమౌతుందని జనాలు…

టీడీపీ చెబుతున్న గరుడ పురాణాన్ని కామెడీ సినిమాగా కొట్టిపడేశారు 30 ఇయర్ ఇండస్ట్రీ పృధ్వి. త్వరలోనే గరుడ పురాణానికి పోటీగా తను గవ్వల పురాణం రిలీజ్ చేస్తానని ప్రకటించారు. వాళ్లు చెప్పేది నిజమౌతుందని జనాలు నమ్మితే, తను చెప్పేది కూడా నిజమౌతుందని వాదిస్తున్నారు పృధ్వి.

“వాళ్లు (టీడీపీ) ఏదేదో ఊహించుకొని గరుడ పురాణం రాశారు. మేం గవ్వల పురాణం రాస్తున్నాం. గవ్వలన్నీ అలా ఎగిరొచ్చి పడతాయి. ఒక్కొక్క గవ్వ ఒక్కో రాజకీయ నాయకుడి జాతకాన్ని బయటపెడుతుంది. రాస్తున్నాం, డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాం. గవ్వ బయటకొచ్చిందంటే టీడీపీ నేతల జాతకాలు బయటకొచ్చినట్టే. వాళ్లు గరుడపురాణం అన్నప్పుడు మేం గవ్వల పురాణం అంటే తప్పేముంది. మీరు చెప్పేది నిజమైతే, మేం చెప్పేది కూడా నిజమౌతుంది.”

జగన్ పై హత్యకు కుట్ర జరిగితే టీడీపీ నేతలు నవ్వుతూ ప్రెస్ మీట్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు పృధ్వి. ఒక జంతువుకు దెబ్బ తగిలితే 10 జంతువులు చుట్టూ చేరతాయి. ఆ పాటి జ్ఞానం, మానవత్వం కూడా టీడీపీ నేతలకు లేదన్నారు.

“కత్తి చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. హత్యా ప్రయత్నం జరిగిందా లేదా అనేది చూడాలి. అదే కత్తి గుండెలో గుచ్చుకుంటే ఇంకో రకంగా ఉండేది. మెడపై తగిలితే మరో రకంగా ఉండేది. తీవ్రతను అర్థం చేసుకోవడం లేదు టీడీపీ. వీళ్లకు జరిగితే మాత్రం ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తారు. ప్రతిపక్ష నాయకుడికి జరిగితే మాత్రం హాస్యం.” 

ఇదే దాడి చంద్రబాబుపై జరిగితే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తారని, ఎయిర్ పోర్టులోనే దొర్లేసి రాష్ట్రమంతా రచ్చ చేస్తారని విమర్శించారు పృధ్వి. ధర్మపోరాటం టైపులో మరో పేరు పెట్టి, అడ్డంగా పడిపోయి దొంగ దీక్షలు చేసేవారని ఎద్దేవా చేశారు. సింపతీ కోసం నటించాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు.

“సింపతీ కోసం నటించాల్సిన అవసరం జగన్ కు లేదు. రాజశేఖర్ రెడ్డిగారి కుటుంబం డ్రామా కంపెనీ కాదు. డ్రామాలు వాళ్లకు ఇష్టం ఉండదు. పోనీ సింపతీ కోసమే చేశారనుకుందాం. అలాంటప్పుడు కత్తి తగలగానే కింద పడిపోవాలి కదా. నానా హంగామా చేయాలి కదా. రాష్ట్రమంతా అల్లకల్లోలం చేయాలి కదా. దెబ్బ తగిలినా సింహంలా లేచారు. నవ్వుతూ నడుచుకుంటూ వెళ్లిపోయారు. దటీజ్ జగన్”

టీడీపీ జనాలు అనుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో హంగ్ లు, బొంగులు ఏం రావన్నారు పృధ్వి. అడ్డదిడ్డమైన సమీకరణాలు, కాంగ్రెస్ తో అక్రమ సంబంధాల్లాంటి వ్యవహారాలు వైఎస్ఆర్సీలో ఉండవన్నారు. రాబోయే తీర్పు వన్ సైడ్ ఉంటుందని… వైఎస్ఆర్సీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు పృధ్వి.