Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమా అంత వీజీ కాదు?

ఆ సినిమా అంత వీజీ కాదు?

నగేష్ కుకునూరు డైరక్షన్ లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా ప్లానింగ్ లో వుంది. ఈ మధ్య దీనికి సంబంధించి, ఈ ప్రాజెక్టులోకి దిల్ రాజు ఎంటర్ అయ్యారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ఓ పదిరోజులు షూట్ చేసి ఆగింది. ఆ తరువాత ఇటీవలే దిల్ రాజు దగ్గరకు వచ్చింది. ఆఫీసర్ సినిమాతో ఈ సినిమా నిర్మాత ఒకరు కావడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, వాటిని వేరే విధంగా సర్దుబాటు చేసుకుంటున్నారని బోగట్టా. అయితే ఈ విషయం తెలిసి, హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమా చేయాలా? మానాలా? అని డైలామాలో పడినట్లు బోగట్టా.

దాంతో ప్రాజెక్టును దిల్ రాజు దగ్గరకు తీసుకవచ్చారు. అయితే ఇప్పుడు కూడా ఇంకా కీర్తి సురేష్ పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దిల్ రాజును ప్రాజెక్టులోకి తీసుకురావడం కూడా, కీర్తి నో అనకుండా, సినిమా ఆగిపోకుండా చేయడం కోసమే అని తెలుస్తోంది.

మరోపక్క కీర్తి సురేష్ ఇప్పటికే స్టార్ట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా దాదాపు పూర్తయి, విడుదల దిశగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. 

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?