ఆ డైరక్టర్ దృష్టి అఖిల్ మీద

మనతో పని చేయాలని ఒకళ్లకు వుంటుంది. కానీ మన దృష్టి వేరే వాళ్ల మీద వుంటుంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వ్యవహారం ఇలాగే వున్నట్లు తెలుస్తోంది. సరైన డైరక్టర్, సరైన బ్యానర్ కోసం తెగ…

మనతో పని చేయాలని ఒకళ్లకు వుంటుంది. కానీ మన దృష్టి వేరే వాళ్ల మీద వుంటుంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వ్యవహారం ఇలాగే వున్నట్లు తెలుస్తోంది. సరైన డైరక్టర్, సరైన బ్యానర్ కోసం తెగ ఉత్సాహంగా వెదుకుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ.

గీతా బ్యానర్ లో మారుతి డైరక్షన్ లో ఓ సినిమా చేయాలి. అదికాక మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. వీటిలో ఒకదానికి విన్నర్ అంటూ లూజర్ ను చేసిన గోపీచంద్ మలినేని డైరక్టర్.

ఇదిలా వుంటే మైత్రీ సంస్థ దగ్గర డేట్లు వున్న చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టులోకి వెళ్లాలని సాయిధరమ్ తేజ తెగ ప్రయత్నిస్తున్నాడట. కానీ చంద్రశేఖర్ యేలేటి మాత్రం ఎలాగైనా సరైన కథ చెప్పి, అక్కినేని అఖిల్ ను ఒప్పించాలని చూస్తున్నాడు. చంద్రశేఖర్ కు అయితే, సాయిధరమ్ తో చేసే ఆలోచన లేదని బోగట్టా.

మైత్రీ సంస్థ కూడా ప్రస్తుతానికి సైలెంట్ గా వుంది. ఇంటిలిజెంట్ ఫలితం చూసి డిసైడ్ కావచ్చులే, తొందర ఎందుకు? అని. ఇంటిలిజెంట్ హిట్ అనిపించుకుంటే ఓకె. లేదూ అంటే సాయిధరమ్ తేజకు కష్టమే.

బంధువు అల్లు అరవింద్ కూడా తన ప్రాజెక్టు ను వెంటనే స్టార్ట్ చేయడానికి సంకోచిస్తారేమో? ఎందుకంటే సినిమా అంటే కోట్ల రూపాయల బిజినెస్ కదా? లాభం మాట దేవుడెరుగు. నష్టం రాకూడదని చూస్తారు. బిజినెస్ ఇంటిలిజెన్స్ అలాంటిది.