ప్లాన్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. మరీ హడావుడీ లేదు అలా అని నీరసమూ లేదు. వన్ బై వన్ చేస్తూ పోతున్నాడు.
ప్రస్తుతం ఘని సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి ఎఫ్ 3 వుండనే వుంది. ఈ రెండింటి తరువాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో భోగవిల్లి ప్రసాద్ కు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా యుకె లోనే షూట్ చేయాల్సి వుంటుంది. అయితే ఇంకా టైమ్ వుంది కాబట్టి, ఆ సమయానికి యుకె పరిస్థితి మెరుగు అవుతుంది అని అంచనా వేస్తున్నారు.
ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జునతో సినిమా చేయాల్సి వుంది. అది పూర్తయిన తరువాతే వరుణ్ తేజ్ సినిమా వుంటుంది, మొత్తం మీద 2021 డైరీ అయితే ఫుల్ అయిపోయింది వరుణ్ తేజ్ కు.