టీడీపీకి లోక్ సభలో ఉన్న వారు ముగ్గురంటే ముగ్గురు ఎంపీలు. అందులో ఇద్దరు కృష్ణ జిల్లా, గుంటూరుకు చెందినవారు అయితే ఇక ఉత్తరాంధ్రా నుంచి గెలిచిన ఏకైన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతూనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రామ్మోహన్ నాయుడు నుంచి గమ్మత్తు అయినా లేఖ వచ్చింది. తనకు పది రోజుల పాటు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాశారు రామ్మోహన్.
లేడీస్ కి ప్రసూతి సెలవులు ఇస్తున్న మాదిరిగానే తనకు పితృత్వ సెలవులు ఇవ్వాలంటూ ఆయన ఆ లేఖలో స్పీకర్ ని తమాషాగా కోరడం విశేషం.
ప్రస్తుతం తన భార్య ప్రసవించే సమయం ఆసన్నమైందని, తాను ఒక భర్తగా, పుట్టబోయే బిడ్డకు తండ్రిగా ఈ కీలక సమయంలో ఆమె పక్కన ఉండాల్సిన బాధ్యత ఉందని రామ్మోహన్ పేర్కొన్నారు. అందువల్ల తనకు పది రోజులు సెలవు ఇస్తే చాలు అంటూ విన్నవించుకున్నారు.
ఇదిలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తెను రామ్మోహన్ నాయుడు 2017లో పెళ్ళి చేసుకున్నారు. అతి తొందరలో ఆయన తండ్రి కాబోతున్నారన్న మాట.