ఆ ఇద్దరూ వేరు పడ్డారా?

సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనే ఒకే బంధాలు కలకాలం వుండవు. అందునా దర్శకులు-రైటర్ల బంధాలు మరీనూ. ఎప్పటికో ఒక్కప్పటికి ఈ రైటర్ ఆ డైరక్టర్ ను వీడి, తను కూడ మెగాఫోన్ పట్టాల్సిందే. టాలీవుడ్ లో లేటెస్ట్…

సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనే ఒకే బంధాలు కలకాలం వుండవు. అందునా దర్శకులు-రైటర్ల బంధాలు మరీనూ. ఎప్పటికో ఒక్కప్పటికి ఈ రైటర్ ఆ డైరక్టర్ ను వీడి, తను కూడ మెగాఫోన్ పట్టాల్సిందే. టాలీవుడ్ లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఓ డైరక్టర్ కు ఆయనతో చెట్టాపట్టాలేసుకుని, మంచి హిట్ లు అందించిన రైటింగ్ అసోసియేట్ ఇప్పుడు విడిపోయారన్నది.

సినిమా చూపిస్తామామా, నేను లోకల్ లాంటి సినిమాలు అందించిన దర్శకుడు నక్కిన త్రినాధరావుకు, జబర్థస్త్ బ్యాక్ గ్రవుండ్ నుంచి వచ్చిన బెజవాడ ప్రసన్న మాంచి సన్నిహితుడు. ఇద్దరు కలిసే రెండు సినిమాలు చేసారు. నక్కినకు బెజవాడ ఆల్ మోస్ట్ బ్యాక్ బోన్. కేవలం రైటింగ్ వరకే కాకుండా, సినిమా మేకింగ్ లో కూడా అండా దండగా వుంటూవచ్చారు.

అయితే ఇప్పుడు డైరక్టర్ నక్కిన త్రినాధరావు వేరే రైటర్ కథతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ కథ చెప్పారు కానీ అది హీరోకి నచ్చలేదు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కోసం ఓ స్క్రిప్ట్ ట్రయ్ చేస్తున్నారు. అందుకోసం త్రినాధ సాయికృష్ణ అనే రైటర్ కథను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రస్తుతం నక్కిన త్రినాధరావు తన టీమ్ తో అరకులో స్టోరీ డెవలప్ చేయడంలో బిజీగా వున్నట్లు బోగట్టా.

నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా..