Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ రెండు సినిమాల లైన్ ఒకటే?

ఆ రెండు సినిమాల లైన్ ఒకటే?

పలు విఫల ప్రయత్నాల తరువాత హీరో అక్కినేని అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

2019లో సినిమా రిలీజ్ లేకపోయినా, 2020 లో నాలుగు సినిమాలు విడుదలయ్యేలా వర్క్ చేస్తున్నాడు హీరో నితిన్. వాటిల్లో భీష్మ ఒకటి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు.

ఈ రెండు సినిమాలు కథలు వేరు కావచ్చు కానీ, బేసిక్ లైన్ ఒకటే అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. హీరోయిన్ ప్రేమ గెల్చుకోవడం కోసం, ఆమెను, ఆమె ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడం కోసం కష్టపడడం అన్నది బేసిక్ పాయింట్ గా తెలుస్తోంది.

బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో కాబోయే మామగారు అపార్థం చేసుకుంటే, తిరిగి ఎలా ప్రయోజకుడై ఎలా ఇంప్రెస్ చేసాడు హీరో అన్నది పాయింట్ గా వినిపిస్తోంది.

వెంకీ కుడుముల  భీష్మ సినిమాలో, పనీపాటు లేదని పెద్దగా సదభిప్రాయం లేకుంటే, కష్టపడి కంపెనీ పెట్టి,  ప్రయోజకుడై హీరోయిన్ ను, ఆమె ఫ్యామిలీని హీరో ఎలా ఇంప్రెస్ చేసాడు అన్నది పాయింట్ గా వినిపిస్తోంది. 

ఎప్పుడయినా కథలు, పాయింట్లు కొన్నే వుంటాయి. వాటినే తిప్పి తిప్పి కొత్తగా చెప్పడంలోనే టాలెంట్ వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?