ఆచారి కష్టాలకు అంతుపొంతు లేదు

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఆచారి అమెరికా యాత్ర. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం థియేటర్లలో బంద్ నడుస్తోంది కాబట్టి విడుదల కాదు. ఆ తర్వాత కూడా వస్తుందనే గ్యారెంటీ…

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఆచారి అమెరికా యాత్ర. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం థియేటర్లలో బంద్ నడుస్తోంది కాబట్టి విడుదల కాదు. ఆ తర్వాత కూడా వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే బడా సినిమాలన్నీ బెర్తులు ఫిక్స్ చేసుకొని రెడీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా వచ్చేది మే మూడో వారం తర్వాతే అనే విషయం తేలిపోయింది.

కానీ ఆచారికి అడ్డంకిగా ఉన్నది కేవలం ఈ విడుదల తేదీ మాత్రమే కాదు. చాలా ఫైనాన్షియల్ గొడవలు ఈ సినిమా చుట్టూ అల్లుకొని ఉన్నాయి. నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరికి తన గత సినిమాల ఇష్యూలు కొన్ని ఉన్నాయి. ఆ లెక్కలు క్లియర్ చేస్తే తప్ప ఆచారికి దారిదొరకని పరిస్థితి.

మరోవైపు కనీసం శాటిలైట్ అయినా పూర్తిచేద్దామనుకుంటే అది కూడా సాధ్యపడలేదు. ఇటీవల ఈ సినిమాను ఎక్స్ క్లూజివ్ గా ఓ టీవీ ఛానెల్ కు చూపించారు. డీల్ ఆల్ మోస్ట్ సెట్ అయిపోతుందని అనుకున్నారు. గట్టిగా బేరమాడి ఓ 2కోట్లకు శాటిలైట్ రైట్స్ డీల్ చేసుకుందామని భావించారు. కానీ సదరు ఛానెల్ వాళ్లు మాత్రం ఆచారి టీమ్ కు గట్టిగానే ఝలక్ ఇచ్చారట. కంటెంట్ బాగాలేదని, ఎంత తగ్గించి ఇచ్చినా తీసుకోలేని మొహంమీదే చెప్పినట్టు తెలుస్తోంది.

మొన్నటికిమొన్న మోహన్ బాబు నటించిన గాయత్రి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకంటే ముందొచ్చిన మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మంచు విష్ణు నటించిన ఆచారి అమెరికా యాత్ర ల్యాబ్ కే పరిమితమైపోయింది. మంచు హీరోలకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో..?