Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అడిగితే చెప్పేస్తారా అఖిల్?

అడిగితే చెప్పేస్తారా అఖిల్?

అప్పుడే మీడియాకు సుద్దులు చెప్పేస్తున్నాడు అఖిల్. అఖిల్-వంశీ పైడిపల్లి సినిమాపై గ్యాసిప్ లు రావడంతో, తనకు మేనేజర్ వున్నారు.. పిఆర్ టీమ్ వుంది. ఎవరు కావాలంటే వాళ్లు కలవండి.. మాట్లాడండి.. తెలుసుకుని రాయండి అనే టైపులో ట్వీట్ చేస్తున్నాడు. 

నిజంగా ఆ మేనేజర్ నో, పీఆర్ టీమ్ నో, 'బాబూ భారీ బడ్జెట్ మీ బాబు మీద పెడితే వర్కవుట్ కాదని, మైత్రీ మూవీస్ వాళ్లు వెనక్కు వెళ్లారంట నిజమేనా' అని అడిగితే చెబుతారా? అబ్బే అసలు వాళ్లతో డిస్కషనే లేదు.. ఇక వెనక్కు వెళ్లడం ఏమిటి అంటూ కవరింగ్ మొదలెడతారు. పోనీ అఖిల్ ఇప్పుడు ఇంత ట్వీటిన వాడు.. వంశీతో సినిమా వుంటుంది అని చెప్పిన వాడు.. మైత్రీ మూవీస్ వెనక్కు వెళ్లిన విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. 

మరి అఖిల్ నే విషయాలు దాచేస్తుంటే, ఆయన పీఆర్ టీమ్, మేనేజర్ అన్నీ చెప్పేస్తారా? భలే జోక్ నే. ఈ గ్యాసిప్ లు, ట్వీట్ లు కన్నా చకచకా సినిమాలు చేయాలి ముందు..ఒకటో సినిమాకు రెండో సినిమాకు గ్యాప్ చాలా పెరిగిపోతోంది మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?