Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్‌ లాస్‌.. మహేష్‌ గెయిన్‌.!

అఖిల్‌ లాస్‌.. మహేష్‌ గెయిన్‌.!

అఖిల్‌ హీరోగా సినిమా తెరకెక్కించాల్సిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు మహేష్‌ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అది కూడా పీవీపీ బ్యానర్‌లో. ఇది నిజంగానే అఖిల్‌కి పెద్ద లాస్‌. ఎందుకంటే వంశీ పైడిపల్లిది విలక్షణ శైలి. మాస్‌ టచ్‌ వున్న క్లాస్‌ డైరెక్టర్‌.. క్లాస్‌ టచ్‌ వున్న మాస్‌ డైరెక్టర్‌ కూడా. 'బృందావనం', 'ఎవడు' చిత్రాలే ఇందుకు నిదర్శనం. లేటెస్ట్‌గా 'ఊపిరి' చిత్రాన్ని తెరకెక్కించిన వంశీలోని టాలెంట్‌ని గ్రహించిన నాగార్జున, అఖిల్‌తో సినిమా చేయాల్సిందిగా వంశీకి సూచించినమాట వాస్తవం. 

అయితే, వంశీతో ఓ రీమేక్‌ని అఖిల్‌ ప్లాన్‌ చేయడం, ఆ విషయంలో ఇద్దరి మధ్యా అభిప్రాయబేధాలు తలెత్తడంతో, వంశీ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఈలోగా వంశీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఓ పక్క అల్లు అర్జున్‌ నుంచీ, ఇంకోపక్క మళ్ళీ చరణ్‌ నుంచీ వంశీకి పిలుపులు అందాయి. ఎలా సెట్టయ్యిందోగానీ, వంశీ పైడిపల్లి - మహేష్‌ కాంబినేషన్‌లో సినిమాని పీవీపీ బ్యానర్‌ ఫిక్స్‌ చేసేసింది. 

ప్రస్తుతం మహేష్‌, మురుగదాస్‌ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకగానీ, మహేష్‌ - వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు అవకాశాల్లేనట్టే. ఈలోగా, వంశీ ఇంకేదన్నా సినిమాకి కమిట్‌ అయ్యే ఛాన్సుందా.? అన్న విషయమై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా, వంశీని వదులుకోవడం అఖిల్‌కి పెద్ద లాస్‌ అనే చెప్పాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?