ఇద్దరు హీరోయిన్లతో నాని ’లోకల్‘

'చంటిగాడు.. పక్కా లోకల్‌..' ఇది పూరి జగన్నాథ్‌ హీరో చెప్పే డైలాగ్‌. కానీ, 'నేను లోకల్‌' అంటున్నాడు యంగ్‌ హీరో నాని. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి ఈ టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు.…

'చంటిగాడు.. పక్కా లోకల్‌..' ఇది పూరి జగన్నాథ్‌ హీరో చెప్పే డైలాగ్‌. కానీ, 'నేను లోకల్‌' అంటున్నాడు యంగ్‌ హీరో నాని. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి ఈ టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా నటించనుంది. మరో హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుంది. ’జెంటిల్ మెన్‘ ఫేం నివేదా థామస్,‘క్రిష్ణగాడి వీర ప్రేమగాధ‘ ఫేం మెహరీన్ కౌర్ పేర్లను రెండో హీరోయిన్ కోసం పరిశీలిస్తున్నారట. 

'దిల్‌' రాజు నిర్మిస్తున్న ఈ 'నేను లోకల్‌' చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందట. వరుస హిట్స్‌తో మంచి జోరు మీదున్న నాని, ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటున్నాడు దర్శకుడు నక్కిన త్రినాధరావు. గతంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన 'సినిమా చూపిస్త మావ' చిత్రానికి నక్కిన శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన విషయం విదితమే. 

ఇదిలా వుంటే, నాని హీరోగా తెరకెక్కుతున్న 'మజ్ఞు' సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 'ఉయ్యాల జంపాల' ఫేం విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్‌ అను ఇమ్మానియేల్‌ని టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు.