Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెట్స్ పైకి రాని అఖిల్ సినిమా.. రీజన్ ఏంటి?

సెట్స్ పైకి రాని అఖిల్ సినిమా.. రీజన్ ఏంటి?

సినిమా లాంఛ్ అయి 2 నెలలు దాటింది అఖిల్ కూడా ఖాళీగానే ఉన్నాడు కానీ ఇప్పటివరకు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ చేయాల్సిన సినిమా సెట్స్ పైకి రాలేదు. మార్చిలో ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలుకాలేదు.

లాంఛ్ కు ముందే వెంకీ అట్లూరి లొకేషన్లు ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. లాంఛ్ తర్వాత బ్యాంకాక్ లో ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందని ఫీలర్లు కూడా వదిలారు. కానీ అది వర్కవుట్ కాలేదు. తర్వాత తనకు కలిసొచ్చిన లండన్ లో షూటింగ్ ఉంటుందంటూ వెంకీ అట్లూరి స్వయంగా ప్రకటించాడు. ఆ లండన్ షెడ్యూల్ కూడా మొదలుకాలేదు.

ఇప్పుడు తాజాగా మరో తేదీ బయటకొచ్చింది. ఈనెల 20 నుంచి అఖిల్-వెంకీ అట్లూరి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఈ డేట్ అయినా ఫిక్స్ చేస్తారా, లేక సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా అనేది డౌట్.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ కు వీసా సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. మ్యాగ్జిమమ్ షూటింగ్ ను యూకేలోనే ప్లాన్ చేసిన కారణంగా.. చాలామందికి వీసాల మంజూరులో ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి వీసాలు క్లియర్ అయిపోయి, యూకేలో షూట్ స్టార్ట్ అయితే దాదాపు 70శాతం షూట్ అక్కడే పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దసరాకు సినిమాను సిద్ధం చేయాలనేది ప్లాన్. కానీ షూట్ లేట్ అవ్వడం వల్ల దసరా బరి నుంచి ఈ మూవీ దాదాపు తప్పుకున్నట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?