అలీ.. హీరోయిన్లపై మళ్లీ వల్గర్ కామెంట్స్!

సినీ ఫంక్షన్లలో.. అవార్డుల కార్యక్రమాల్లో ఇప్పటికే అలీ వ్యాఖ్యానాలు విమర్శలకు గురి అయ్యాయి. ప్రత్యేకించి డబుల్ మీనింగులు మాట్లాడటం, హీరోయిన్ల మీద అనుచితమైన కామెంట్లు చేయడం అలీకి అలవాటుగా మారిందనే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి.…

సినీ ఫంక్షన్లలో.. అవార్డుల కార్యక్రమాల్లో ఇప్పటికే అలీ వ్యాఖ్యానాలు విమర్శలకు గురి అయ్యాయి. ప్రత్యేకించి డబుల్ మీనింగులు మాట్లాడటం, హీరోయిన్ల మీద అనుచితమైన కామెంట్లు చేయడం అలీకి అలవాటుగా మారిందనే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ విషయాన్ని ఒకవైపు ఒప్పుకుంటూనే.. మరో వైపు, మళ్లీ తన నాలుక పదునంతా ఉపయోగించేశాడు అలీ.

తాజాగా టీవీల్లో ప్రసారం అయిన ఒక అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అలీ .. రెచ్చిపోయాడు. ఈ మధ్య తనేం మాట్లాడినా డబుల్ మీనింగయిపోతోందంటూనే.. అలీ మరిన్ని డబుల్ మీనింగ్స్ మాట్లాడేశాడు. ఈ కార్యక్రమంలో అలీ రెచ్చిపోయిన తీరును చూసి.. అతడితో సహ వ్యాఖ్యతగా వ్యవహరించిన మంచు లక్ష్మి కూడా చాలా సార్లు సైలెంటయిపోయింది. 

“నోట్లో ఏం పెట్టాలి..?’’ ‘ ఆరడుగులుండే వారిలో ఆ మ్యాటరుండదు..’ ‘కాయ కచేరీ..’ ఇవీ అలీ నోటి నుంచి జాలు వారిని మాటలు. మాట్లాడితే డబుల్ మీనింగే అయ్యుండాలి అన్నట్టుగా అలీ రెచ్చిపోయాడు. ఇక ఈ డబుల్ మీనింగులకు మెగాస్టార్ చిరంజీవితో సహా అంతా పడీ పడీ నవ్వుతున్న తీరును చూశాకా మాత్రం చాలా మంది రిమోట్ లకు పని చెప్పి వేరే ఛానల్ ను వెదుక్కునే పనిలో పడ్డారు. 

అలాగే సీనియర్ నటి ఖుష్బూ మీద కూడా అలీ అనుచితమైన మాటలే మాట్లాడాడు. ఆమె అయితే అలీ మాటలకు నవ్వింది కానీ.. వినేవాళ్లకు మాత్రం ఏందిది? అనిపించింది. ఖుష్బూ ను పరమ వెకిలిగా ‘క్రీమ్ బిస్కెట్ లాగుంది..’’ అనేశాడు అలీ. మరి ఆ మధ్య  ఇలాంటి డబుల్ మీనింగ్స్ విషయంలో ఎవరో అలీని హెచ్చరించారు అని వార్తలు వచ్చాయి. తీరు మార్చుకొమ్మని వారు చెప్పారట. బహుశా అది నిజం కాకపోవచ్చు అని ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టే.!