అనిల్ రావిపూడితో చైతూ!

హీరో నాగ్ చైతన్య ప్లానింగ్ చాలా స్మూత్ గా వుంటుంది. జాగ్రత్తగా ఆచితూచి సినిమాల ఎంచుకుంటారు. సినిమాలు హిట్ నా కాదా అన్నది పక్కన పెడితే ప్రాజెక్టులు ప్రామిసింగ్ గా కనిపిస్తాయి. Advertisement ప్రస్తుతం…

హీరో నాగ్ చైతన్య ప్లానింగ్ చాలా స్మూత్ గా వుంటుంది. జాగ్రత్తగా ఆచితూచి సినిమాల ఎంచుకుంటారు. సినిమాలు హిట్ నా కాదా అన్నది పక్కన పెడితే ప్రాజెక్టులు ప్రామిసింగ్ గా కనిపిస్తాయి.

ప్రస్తుతం చైతూ శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ సినిమా చేస్తూ, విక్రమ్ కే కుమార్ తో 'థాంక్ యూ' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ తరువాత ఏంటీ అన్నది పాయింట్. నిజానికి సాహు నిర్మాతగా ఇంద్రగంటి డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ ప్రస్తుతం ఆ సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. సాహు దగ్గరే డైరక్టర్ అనిల్ రావిపూడి డేట్ లు కూడా వున్నాయి. అందువల్ల ఆ కాంబినేషన్ ట్రయ్ చేసే ఆలోచనలో చైతూ వున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ సినిమా తరువాతనే కాకపోయినా, ఓ సినిమా గ్యాప్ తరువాత అయినా ఆ ప్రాజెక్టు అయితే బెటర్ అనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి దగ్గర హీరోయిన్ కు కూడా మాంచి ప్రాధాన్యత వున్న లైన్  ఒకటి వుంది. ఆ లైన్ తో సినిమా చేసే దిశగా డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. కానీ దానికి సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కావాలి.

అలాగే ఆ మధ్య లూజర్ అనే వెబ్ ఫిల్మ్ అందించిన డైరక్టర్ తో కూడా చైతూ డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదంతా చూస్తుంటే ప్రస్తుతానికి అయితే ఇంద్రగంటి సినిమా ఆలోచన మరి లేనట్లే అనుకోవాలి.

జగన్ సుదర్శన చక్రం ఎప్పుడు ప్రయోగిస్తారో