ఛార్మి తర్వాత ‘హాట్ సీట్’లోకి మరో పంజాబీభామ!

డ్రగ్స్ కు సంబంధించిన విచారణ తెలుగు సినిమా పరిశ్రమను ఏ రేంజిలో కుదిపేసిందో అందరూ గమనించారు. ఏకంగా టాప్ రేంజి సెలబ్రిటీలనుంచి పనిలేకుండాపోయిన హీరోల వరకూ చాలా మందే విచారణకు హాజరయ్యారు. Advertisement నిజానికి…

డ్రగ్స్ కు సంబంధించిన విచారణ తెలుగు సినిమా పరిశ్రమను ఏ రేంజిలో కుదిపేసిందో అందరూ గమనించారు. ఏకంగా టాప్ రేంజి సెలబ్రిటీలనుంచి పనిలేకుండాపోయిన హీరోల వరకూ చాలా మందే విచారణకు హాజరయ్యారు.

నిజానికి డ్రగ్స్ కేసులో విచారణకు సినిమాయేతర రంగాలకు చెందిన పలువురు కూడా వెళ్లవలసి వచ్చినప్పటికీ వారి గురించి ఎక్కడా మీడియాలో పెద్దగా ఫోకస్ కనిపించలేదు. అయితే తొలి విడత సినిమా వారి విచారణ పూర్తయ్యాక ఇంకా పలువురి పేర్లు ఉన్నాయని సరైన సమయంలో వారిని కూడా విచారిస్తామని పోలీసులు చెప్పారు.

అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీనుంచి ముగ్గురి పేర్లు విచారణకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్ ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. తొలివిడతలో హీరోయిన్ ఛార్మిని విచారించిన సంగతి తెలిసింది. రెండో విడత పేర్లలో ఉన్న హీరోయిన్ కూడా పంజాబీ భామే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో.. చాలా తక్కువ వ్యవధిలోనే హాట్ హీరోయిన్ గా లైమ్ లైట్ లోకి వచ్చి, హైదరాబాదులో సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించిన ఓ భామను పోలీసులు విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. 

అలాగే మిగిలిన ఇద్దరు హీరోలు కూడా టాలీవుడ్ లో పాతుకుపోయిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారు అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఛార్మి చేతిలో అవకాశాలు తగ్గి వెటరన్ హీరోయిన్ గా మారిన తర్వాత డ్రగ్స్ కేసులో చిక్కుకుంటే.. ప్రస్తుతం బిజిబిజీగా ఉన్న నాయిక కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు బయటకు పొక్కడం సంచలనంగానే ఉంది.