Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క- మళ్లీ మరో హర్రర్ థిల్లర్

అనుష్క- మళ్లీ మరో హర్రర్ థిల్లర్

లాస్ట్ ఇయర్ సంక్రాంతి తరువాత భాగమతి సినిమాలో హిట్ ఇచ్చింది హీరోయిన్ అనుష్క. ఆ తరువాత మళ్లీ సినిమా చేయలేదు. ఇప్పుడు మళ్లీ మరో హర్రర్ థ్రిల్లర్ నే సెలెక్ట్ చేసుకుంది అనుష్క. కోన ఫిలి కార్పొరేషన్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి.

అనుష్క సరసన తమిళ హీరో మాధవన్ నటిస్తారు. ఈ ఇద్దరితో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇప్పటికి ఎంపికయిన తారాగణం. మార్చినెలలో అమెరికాలో ప్రారంభయ్యే ఈ సినిమాను అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో ఒకేసారి షూట్ చేస్తారు.

హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో, గోపి మోహన్, నీరజ కోనలు ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల టార్గెట్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?