ఏప్రియల్ నుంచి రవితేజ-శ్రీనువైట్ల

మొత్తానికి మైత్రీ మూవీస్ మరో సినిమా ఫైనల్ అయిపోయినట్లే. హీరో రవితేజతో దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. Advertisement ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ ల హ్యాట్రిక్ డిజాస్టర్ల తరువాత…

మొత్తానికి మైత్రీ మూవీస్ మరో సినిమా ఫైనల్ అయిపోయినట్లే. హీరో రవితేజతో దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ ల హ్యాట్రిక్ డిజాస్టర్ల తరువాత దర్శకుడు శ్రీనువైట్ల చేపడుతున్న సినిమా. ఈ సినిమాకు మరో స్పెషాలిటీ వుంది. హీరోగా ఫెయిల్యూర్స్ చవిచూస్తున్న సునీల్ మళ్లీ కమెడియన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్న తొలి సినిమా ఇది.

ఈ సినిమా షూట్ ఏప్రియల్ నుంచి ప్రారంభమవుతుంది. అమెరికాలో తొలి షెడ్యూలు వుంటుంది. ఈ సినిమాకు స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయింది.

అయితే రవితేజ రెమ్యూనిరేషన్ బేరాలు, డేట్లు అన్నీ సెటిల్ అయ్యేసరికి ఈ టైమ్ అయింది. హీరోయిన్ ఎంపిక పై కసరత్తు జరుగుతోంది. అను ఇమ్మాన్యుయేల్ ఓ ఆప్షన్ గా అనుకుంటున్నారు.